AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adilabad: మా పార్క్ భూమిని కబ్జా చేశారు.. హైకోర్టుకు చిన్నారుల లేఖ

ఆదిలాబాద్ లోని బడుగు బలహీన వర్గాల కోసం కేటాయించిన హౌసింగ్ బోర్డు కాలనీలోని పిల్లల పార్కు స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేయడంపై 23 మంది పిల్లలు రాసిన లేఖను హైకోర్టు పిల్ గా పరిగణించింది. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది.

Adilabad: మా పార్క్ భూమిని కబ్జా చేశారు.. హైకోర్టుకు చిన్నారుల లేఖ
Park
Naresh Gollana
| Edited By: |

Updated on: Feb 23, 2024 | 2:50 PM

Share

ఆదిలాబాద్ లోని బడుగు బలహీన వర్గాల కోసం కేటాయించిన హౌసింగ్ బోర్డు కాలనీలోని పిల్లల పార్కు స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేయడంపై 23 మంది పిల్లలు రాసిన లేఖను హైకోర్టు పిల్ గా పరిగణించింది. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ కమి షనర్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ బెంచ్ కు నోటీసులు జారీ చేసింది. కబ్జాదారులకు మున్సిపల్ కమిషనర్ శైలజ సలహాలిస్తున్నారని పిల్లలు ఆ లేఖలో పేర్కొ న్నందున ఆమెను కూడా ప్రతివాదిగా చేర్చాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులంతా తమ వాదనలతో కౌంటర్ వేయాలని నోటీసులు జారీ చేసింది హైకోర్ట్. తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.

కాగా, 1970లో ఆదిలాబాద్ బడుగు బలహీన వర్గాల సంక్షేమ కోసం ఏర్పాటైన హౌసింగ్ బోర్డు కాలనీలో 1 ఎకరం పిల్లల పార్క్ కోసం కేటాయించారు. ఆ భూమిలో 30 గుంటల స్థలాన్ని 2000-2004 కాలంలో కొందరు ఆక్రమించారు. మిగిలిన స్థలాన్ని కూడా ఆక్రమించుకునేందుకు ఇటీవల ప్రయత్నాలు మొదలయాయి. పార్కు భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలను నివారించాలని కోరుతూ కాలనీ పెద్దలతో పాటు పిల్లలు కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు. అదికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో 23 మంది పిల్లలు హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు పిల్ గా పరిగణించి విచారణ ప్రారంభించింది. పార్క్ స్థలంలో నిర్మాణం అవుతున్న ఆలయాన్ని ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్ట్ ఉత్తర్వులతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు కబ్జా కు గురైన స్థలంలో నోటీసులు అంటించి ఆలయ నిర్మాణ పనులను నిలిపి వేశారు‌.

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..