TS New Education : పాఠశాల విద్య నుండి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ సర్కార్

తెలంగాణలో నూతన విద్యా విధానం అమల్లోకి రానుంది. స్కూల్ ఎడ్యుకేషన్ నుండి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది..

TS New Education : పాఠశాల విద్య నుండి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ సర్కార్
Education

Updated on: Jul 21, 2021 | 9:17 PM

TS New Education system : తెలంగాణలో నూతన విద్యా విధానం అమల్లోకి రానుంది. స్కూల్ ఎడ్యుకేషన్ నుండి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ఇకపై ఒకటి నుంచి 12 తరగతి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ గా నిర్ణయించారు. ఇప్పటికే డిగ్రీలో క్లస్టర్ విధానం, కామన్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు శ్రీకారం చుట్టారు. అటు పీహెచ్‌డి ప్రవేశాలకు కామన్ ఎంట్రెన్స్ విద్యా విధానం అమల్లోకి రానుంది.

జాతీయ విద్యా విధానంలో ముఖ్యాంశంగా క్లస్టర్ విద్యా విధానం అమల్లోకి రానుంది. ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వాడుకునేలా క్లస్టర్ విద్యా విధానం కొనసాగుతోంది. దీని కోసం సమీపంలో ఉన్న స్కూల్స్ కాలేజెస్, గ్రౌండ్స్, లైబ్రరీ మౌలిక వసతులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటారు. క్లస్టర్ విధానం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లి చదివే విద్యార్థులు సమీపంలో ఉన్న విద్యా సంస్థల్లో చదువుకునే వెసులుబాటు ఉంటుంది. క్లస్టర్స్ విధానంపై యూనివర్సిటీ వీసీ లతో ఇప్పటికే చర్చించారు ఉన్నత విద్యా మండలి అధికారులు. క్లస్టర్స్ విధానంపై కమిటీ వేసింది ఉన్నత విద్యా మండలి.

మూడు విధాలుగా ప్రణాళికలు రచించింది క్లస్టర్స్ కమిటీ. యూనివర్సిటీ టు యూనివర్సిటీ.. అటానమస్ కాలేజెస్ టు అటానమస్ కాలేజ్.. గవర్నమెంట్ కాలేజ్ టు గవర్నమెంట్ కాలేజ్.. ఇలా మూడు స్థాయిలుగా క్లస్టర్ విధానం అమలు చేయనున్నట్టు కమిటీ నిర్ధారించింది. పీహెచ్‌డి అడ్మిషన్లకు జాతీయ స్థాయిలో ఓకే ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనుంది యూజిసి. స్టాండ్ ఎలోన్ యూనివర్సిటీస్ కాకుండా మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ గా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కొత్త జాతీయ విద్యా విధానం పై ఇప్పటికే డ్రాఫ్ట్‌ బిల్ రూపొందించారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. నూతన విద్యా విధానానికి అనుగుణంగా డ్రాఫ్ట్ సిద్ధం చేస్తోంది తెలంగాణ సర్కార్. జాతీయ ఆదాయంలో 6 శాతం విద్యారంగానికి ఖర్చు పెట్టాలనీ ఎక్స్‌పర్ట్స్ కమిటీ నిర్ణయించింది.

Read also: Padi Koushik Reddy : టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న పాడి కౌశిక్ రెడ్డి.. ఆహ్వానించిన సందర్భంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Loading...
Unable to load recommendations.
Follow Us