Telangana: ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!

Telangana: తాజాగా ఎంపిడిఓ ఏసీబీ కి చిక్కడంతో కొంతమంది బాధితులు సంబరాలు జరుపుకున్నారు. ఎంపిడిఓ కార్యాలయం ముందే టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం చర్చగా మారింది. ప్రభుత్వ కార్యాలయంలో ఎంపిడిఓ కొడుకు పెత్తనం చర్చకు దారి తీస్తుంది. ఆమె కొడుకు ను..

Telangana: ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
Acb Raid

Edited By:

Updated on: Jun 13, 2026 | 8:31 AM

ACB Raid: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంపీడీవో రాధికా ఏసీబీ ట్రాప్ అయ్యారు. ఆమెతోపాటు ఎంపీఓ యాకయ్య, ఎంపీడీవో కుమారుడు నాగార్జున్ కూడా ఏసీబీకి చిక్కారు. ఎంపిడిఓ ఏసీబీ ట్రాప్ అవడంతో బాధితులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యాలయం ముందే సంబరాలు జరుపుకోవడం చర్చగా మారింది

నర్సింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామ శివారులో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వెంచర్ అనుమతుల కోసం అధికారులను సంప్రదించాడు. అయితే సంబంధిత ఫైల్ క్లియర్ చేయడం, నాలా కన్వర్షన్ ప్రక్రియకు సహకరించడం కోసం లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.55 వేలు చెల్లించిన బాధితుడు, పని పూర్తికాకపోయినా మిగిలిన రూ.45 వేలు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

Locals Celebrate

ఏసీబీ అధికారుల సూచనల మేరకు మిగిలిన నగదును అందజేస్తుండగా ఎంపీడీవో రాధికా, ఎంపీఓ కిన్నెర యాకయ్యతో పాటు ఎంపీడీవో కుమారుడు నాగార్జున ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వారి వద్ద రూ.45 వేల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు. ఐతే నర్సింహులపేట ఎంపీడీవో కార్యాలయంలో గతంలో కూడా అవినీతి ఆరోపణలతో అధికారులు ఏసీబీకి చిక్కిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎంపిడిఓ ఏసీబీ కి చిక్కడంతో కొంతమంది బాధితులు సంబరాలు జరుపుకున్నారు. ఎంపిడిఓ కార్యాలయం ముందే టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం చర్చగా మారింది. ప్రభుత్వ కార్యాలయంలో ఎంపిడిఓ కొడుకు పెత్తనం చర్చకు దారి తీస్తుంది. ఆమె కొడుకు ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us