AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గెస్ట్ లెక్చలర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. పారితోషికాన్నిపెంచుతూ ఉత్తర్వులు..

తెలంగాణలోని జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్ల పారితోషికాన్ని పెంచుతూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో పీరియడ్‌కు రూ. 300 చొప్పున పారితోషికాన్ని ఇస్తుండగా.. తాజాగా పీరియడ్‌కు రూ. 390కి పెంచూతూ జీవో విడుదల చేసింది తెలంగాణ సర్కార్.

Telangana: గెస్ట్ లెక్చలర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. పారితోషికాన్నిపెంచుతూ ఉత్తర్వులు..
Guest Lecturers
Sanjay Kasula
|

Updated on: Jun 10, 2022 | 12:07 PM

Share

గెస్ట్ లెక్చలర్లకు తెలంగాణ సర్కార్(Telangana) గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా తమ పారితోషికాన్ని పెంచాలని ఆందోళన వ్యక్తం చేస్తున్న గెస్ట్ లెక్చలర్ల డిమాండ్‌ను ఓకే చేసింది తెలంగాణ ప్రభుత్వం. వారి కోరికను మన్నించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గెస్ట్ లెక్చలర్ల పారితోషకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌ జీవో – 1105ని విడుదల చేశారు. దీంతో 405 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న రెండు వేల మంది గెస్ట్‌ లెక్చరర్లకు ప్రయోజనకం కలగనుంది. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చలర్ల పారితోషికాన్ని పీరియడ్ కు రూ. 300 నుంచి రూ. 390కి పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు నెలకు 72 గంటల పాటు పనిచేసేలా..  పారితోషికం రూ. 28,080 మించరాదని సీలింగ్ విధించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 405 జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న రెండు వేల మంది లెక్చలర్లకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల లెక్చలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సర్కార్ ఖజాానాపై కొంత ఆర్థిక భారం పడనుంది. అయితే ఉపాధ్యాయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఎంత వరకు పెరుగనుందంటే..

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గెస్ట్ లెక్చర్లకు ఇస్తున్న వేతనం కాస్తా పెరుగనుంది. వీరికి గతంలో పీరియడ్‌కు రూ. 150 మాత్రమే ఇస్తుండగా.. 2017లో పీరియడ్‌కు రూ. 300కు వరకు పెంచింది. తాజా పీఆర్సీ ప్రకారం.. రూ. 390కి పెంచింది. వీరికి గతంలో పీరియడ్‌కు రూ. 150 చొప్పున నెలకు రూ. 10, 800 మాత్రమే ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం సుమారు రెండు రెట్లు పెంచింది. పీరియడ్‌కు రూ. 300 ఉన్నప్పుడు నెలకు రూ. 21,600 అందగా, తాజా పెంపుతో రూ. 28,080కి చేరింది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ వార్తల కోసం..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!