AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Talasani Srinivas Yadav: పెద్దమనసుతో ఈసారికి మినహాయింపు ఇవ్వాలి.. మంత్రి తలసాని విజ్ఞప్తి

గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలను ఇప్పటికిప్పుడు అమలు చేయడం చేయడం అసాధ్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పెద్దమనసుతో ఈసారికి మినహాయింపు ఇవ్వాలని

Talasani Srinivas Yadav: పెద్దమనసుతో ఈసారికి మినహాయింపు ఇవ్వాలి.. మంత్రి తలసాని విజ్ఞప్తి
Talasani Srinivas Yadav And Satyavathi Rathod
Venkata Narayana
|

Updated on: Sep 12, 2021 | 9:33 PM

Share

Ganesh Immersion: గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలను ఇప్పటికిప్పుడు అమలు చేయడం చేయడం అసాధ్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పెద్దమనసుతో ఈసారికి మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. 6 నెలల ముందుగా కోర్టు నిర్ణయం చెప్తే బాగుండేదని తలసాని అభిప్రాయపడ్డారు. నిమజ్జనం పూర్తయిన 48 గంటల్లోకి హుస్సేన్‌ సాగర్‌‌ను క్లీన్ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. ఇప్పటికిప్పుడు బేబీ పాండ్స్ ఏర్పాటు చేయడం కష్టమన్నారు. పీఓపీ విగ్రహాలు తయారీ చేసుకుంటూ ఎంతో మంది బతుకున్నారని చెప్పారు. ఈ ఏడాది యధావిధిగా నిమజ్జనం జరిగేలా చూడాలన్నారు తలసాని. కోర్టులో రివ్యూ పిటిషన్‌లో సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.

హుస్సేన్ సాగర్‌‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌తో కలిసి ఖైరతాబాద్ గణపతికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. హుస్సేన్‌ సాగర్‌‌లో గణేష్‌ నిమజ్జనాలపై ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్లాస్టర్‌‌ ఆఫ్​ పారిస్‌తో చేసిన విగ్రహాలను ట్యాంక్‌ బండ్‌లో నిమజ్జనం చేయొద్దంటూ కోర్టు తీర్పు ఇచ్చే సమయానికే గణేష్‌ విగ్రహాలు మండపాల్లోకి చేరాయని చెప్పారు.

ఇక, బీజేపీ నేతల హాట్ కామెంట్లకు కూల్ గా సమాధానమిచ్చారు మంత్రి సత్యవతి రాథోడ్. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడితే అధికారంలోకి రారని ఆమె బీజేపీ నేతలకు చురకలంటించారు. ప్రజల మనసులు గెలిస్తే అధికారంలోకి రావడం సాధ్యమవుతుందంటూ ఆమె ప్రతిపక్ష నేతలకు హితవు చెప్పారు. సీఎం కేసీఆర్ పై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత టీఆర్‌‌ఎస్ నాయకులపై ఉందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Read also: Gujarat New CM: గుజరాత్‌లో రాజకీయ ఉత్కంఠకు తెర.. కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ