AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్‌.. ఎందుకంటే..!

KTR: తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర సర్కార్‌ నిర్లక్ష్య వైఖరిపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. భారీ వరదల కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా జనాలు అతలాకుతలం..

KTR: మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్‌.. ఎందుకంటే..!
Minister Ktr
Subhash Goud
|

Updated on: Jul 19, 2022 | 9:54 PM

Share

KTR: తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర సర్కార్‌ నిర్లక్ష్య వైఖరిపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. భారీ వరదల కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా జనాలు అతలాకుతలం అవుతుంటే 2018 నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఇంద ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని కేంద్రంపై మండిపడ్డారు. ప్రధాని మోడీ గారూ.. సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. కో-ఆపరేటవ్‌ ఫెడరలిజం అంటే అర్థం ఇదేనా.? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

2020లో హైదరాబాద్‌లో సంభవించిన వరదలకు కానీ,ఈ ఏడాదిలో గోవవరి వరదలకు సాయం ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా 2018 నుంచి 2022 జూలై 12 వరకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అందించిన సాయం వివరాలతో కేంద్రం విడుదల చేసిన జాబితాను మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి