KTR: ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. వంద లక్షల కోట్ల అప్పులతో ఏం చేశారంటూ?

స్విట్టర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. ప్రధానిగా మోడీ ఒక్కరే వంద లక్షల కోట్లు చేశారని మండిపడ్డారు. ఈ అప్పులన్నీ ఏ పనికి పెట్టారో మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

KTR: ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. వంద లక్షల కోట్ల అప్పులతో ఏం చేశారంటూ?
Pm Modi, Ktr

Updated on: Jan 16, 2023 | 9:35 AM

స్విట్టర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. ప్రధానిగా మోడీ ఒక్కరే వంద లక్షల కోట్లు చేశారని మండిపడ్డారు. ఈ అప్పులన్నీ ఏ పనికి పెట్టారో మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్విట్జర్లాండ్‌లోని ఎన్‌ఆర్‌ఐల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ‘ తెలంగాణ అప్పులను ప్రశ్నించే అర్హత బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడుంది? గతంలో 14మంది ప్రధానులు 56లక్షల కోట్లు అప్పులు చేస్తే.. మోడీ ఒక్కరే వంద లక్షల కోట్లు అప్పులు చేశారు. మరి ఆ వంద లక్షల కోట్ల అప్పు ఏ పనికి పెట్టారు? తెలంగాణ చేసే ప్రతీ పైసా అప్పుకు ప్రతిఫలం ఉంటుంది. మరి వంద లక్షణ కోట్ల అప్పులతో కేంద్రం ఏ మంచి పని చేసింది. అప్పులు చేసి లాభాలొచ్చే రీతిలో పెట్టుబడి పెడితే తప్పులేదు. తెలంగాణ అప్పులపై బీజేపీ నానా యాగీ చేస్తోంది. మేం అప్పుచేసినా, ప్రతీపైసా పెట్టిబడి లాభాలతో తిరిగొస్తుంది. లాజిక్‌లు అర్థం చేసుకోలేనివాళ్లకు ఏం చెప్పగలం’ అంటూ మోడీకి చురకలంటించారు కేటీఆర్‌.

కాగా నేటి (జనవరి 17) నుంచి 20 వరకు స్విట్జర్లాండ్‌లోనే దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే దావోస్‌ చేరుకున్నారు కేటీఆర్‌. ఆయనతో పాటు ప‌లువురు మంత్రలు, ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇందులో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం కానున్నారు. డబ్ల్యూఈఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇండస్ట్రీ రౌండ్‌టేబుల్స్‌లో కూడా కేటీఆర్ పాల్గొననున్నారు. తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో భేటీలు నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..