
రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ కోసం గత ప్రభుత్వం వీర్లపాలెం వద్ద సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో (YTPS ) నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు యూనిట్లను నిర్మిస్తోంది. అయితే గత ఏడాది ప్రస్తుత సీఎం సీఎం రేవంత్ రెడ్డి 2, 3 యూనిట్లను జాతికి అంకితం చేశారు. మిగిలిన మూడు యూనిట్లను కూడా విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెలలో యూనిట్ – 1ను ప్రారంభించేందుకు అధికారులు ట్రయల్ రన్ చేస్తున్నారు. ఈ క్రమంలో యూనిట్ – 1 బాయిలర్కు ఆయిల్ సప్లై చేసే పైప్ లీక్ అయ్యింది. అదే సమయంలో కింద వెల్డింగ్ పనులు చేస్తుండటంతో.. ఆ నిప్పు రవ్వలు అయిల్పై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు యూనిట్ మొత్తానికి వ్యాపించాయి.
ప్రమాద సమయంలో కార్మికులు దూరంగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రమాదం కారణంగా ప్లాంట్లో 600 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ట్రయల్ రన్ చేసేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగడం సహజమే అని థర్మల్ పవర్ ప్లాంట్ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…