Telangana News: బీఆర్ఎస్ vs కాంగ్రెస్..మళ్లీ తెరపైకి పేర్లు, విగ్రహాలు.. హీటెక్కిన పాలిటిక్స్

చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. గ్యారెంటీలన్నీ గారడీలేనని కాంగ్రెస్ ఏడాది పాలన చూస్తే అర్థమైపోయిందని ఆయన విమర్శించారు

Telangana News: బీఆర్ఎస్ vs కాంగ్రెస్..మళ్లీ తెరపైకి పేర్లు, విగ్రహాలు.. హీటెక్కిన పాలిటిక్స్
Ktr Writes To Rahul Gandhi
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 12, 2024 | 12:48 PM

తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కరి మీద మరొక్కరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఆ వివాదం ముగియక ముందే మాజీ మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారని లేఖలో ఆయన విమర్శించారు. సరిగ్గా ఏడాది క్రితం కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు తెలంగాణను ఆగం చేయడమే కాకుండా తెలంగాణ అస్థిత్వాన్ని కూడా దెబ్బతీస్తోందన్నారు. చేతకాని, మతిలేని ముఖ్యమంత్రిని తెలంగాణ నెత్తిన రుద్ది రాహుల్ చేతులు దులుపుకోవడంతో అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతివర్గం అరిగోస పడుతోందని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక వర్గం దాకా సంక్షోభంలో కూరుకుపోతోందని, ఎన్నికల టైంలో ఊరురా తిరిగి ఊదరగొట్టిన గ్యారెంటీలన్నీ గారడీలేనని కాంగ్రెస్ ఏడాది పాలన చూస్తే అర్థమైపోయిందని మండిపడ్డారు.

డిక్లరేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీకే డెడికేషన్ లేదని అక్షరాలా రుజువైపోయిందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీలు.. కాంగ్రెస్ చీటింగ్ చాప్టర్‌లో భాగమేనని తెలంగాణ సమాజానికి తెలిసిపోయిందని పేర్కొన్నారు. గాలి మోటర్లో వచ్చి గాలిమాటలు చెప్పి ఏడాదిపాటు పత్తా లేకుండా పోయిన రాహుల్‌కి తెలంగాణ పట్ల రవ్వంత కూడా బాధ్యత లేదని తేలిపోయిందని విమర్శించారు. ప్రగతిపథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుంటే తెలంగాణ వైపు కనీసం రాహుల్ కన్నెత్తి చూడకపోవడంతో నాలుగు కోట్ల ప్రజలు నిత్యం రగిలిపోతున్నారని ఆరోపించారు. సీఎం ఢిల్లీకి పంపే మూటలపై రాహుల్‌కి ఉన్న శ్రద్ధ, ప్రజలకు ఇచ్చిన మాటపై లేదన్నారు. తాము పదేళ్లలో పేదల బతుకులు మార్చమని, తప్ప పేర్లు మార్చలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తాము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా ? అని ఘాటుగా లేఖ రాశారు

రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ లేఖ రాయడంపై టీకాంగ్రెస్‌ ఎంపీలు నిప్పులు చెరిగారు. ఓర్వలేకే రేవంత్‌ సర్కార్‌పై కేటీఆర్‌ విషం కక్కుతున్నారని ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాహుల్‌గాంధీకి తెలుసన్నారు. మరో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాం నాయక్‌‌లు కూడా కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని.. ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెంకటేష్‌తో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
వెంకటేష్‌తో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
'అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌'.. శుభవార్త చెప్పిన కిరణ్ అబ్బవరం
'అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌'.. శుభవార్త చెప్పిన కిరణ్ అబ్బవరం
చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..
చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..
సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంతంటే?
సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంతంటే?
స్టార్ హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ రాక ఇలా..
స్టార్ హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ రాక ఇలా..
నిండు చూలాలి కడుపుపై కూర్చుని.. కాళ్లతో తొక్కి.. ఓ భర్త కిరాతకం
నిండు చూలాలి కడుపుపై కూర్చుని.. కాళ్లతో తొక్కి.. ఓ భర్త కిరాతకం
ప్రేమలు 2 పై క్రేజీ అప్డేట్..
ప్రేమలు 2 పై క్రేజీ అప్డేట్..
పిచ్చుకల కోసం తన ఇంటినే.. ఈ కరీంనగర్ యువకుడిని అభినందించాల్సిందే
పిచ్చుకల కోసం తన ఇంటినే.. ఈ కరీంనగర్ యువకుడిని అభినందించాల్సిందే
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్న మహిళ.. ఆ తర్వాత సీన్ ఇది
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్న మహిళ.. ఆ తర్వాత సీన్ ఇది
'జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి'
'జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి'