Telangana: ఎన్నికల బరిలోకి కేసీఆర్ కూతురు.. సింహం గుర్తుతోరంగంలోకి.. పోటీ ఎక్కడినుంచంటే?
భారత రాష్ట్ర సమితితో తెగదెంపులు చేసుకొని బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్సీ కేసీర్ కుమార్తె కవిత వచ్చే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.అయితే తన సొంత రాజకీయ పార్టీ అయిన జాగ్రృతి పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో.. ఈ ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిపి పోటీ చేసేలా ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నారు. అన్ని సెట్ అయితే ఈ పార్టీ గుర్తుపైనే కవిత ఎన్నికల బరిలోకి దిగనున్నారు.

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సింహం గుర్తు ఎప్పటినుంచో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలన్న, ఏదైనా పార్టీ రెబల్గా పోటీ చేయాలన్న ఈ సింహం గుర్తుపై చాలామంది ఆధారపడతారు. గతంలో మంత్రి జూపల్లి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తిరుగుబాటు జెండా ఎగరవేసి కొల్లాపూర్ మున్సిపాలిటీలో మెజార్టీ సీట్లు సాధించారు. సింహం గుర్తు ప్రజల్లో ఆకట్టుకునే లాగా ఉండడంతో పాటు… రెబల్ లుక్ ఇవ్వడం, ఈజీ సింబల్ కావడంతో ప్రజలు త్వరగా ఆకర్షితులవుతారు. గత రెండు దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల్లో ఈ సింహం గుర్తు ప్రధాన పార్టీలతో పాటు కనిపిస్తూ వస్తుంది.
అందుకే కవిత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ మున్సిపల్ ఎన్నికల వరకు ఫార్వర్డ్ బ్లాక్ బీ ఫార్మ్లతో జాగృతి అభ్యర్థులు పోటీ చేయనున్నట్టు తెలుస్తొంది. ఎన్నికల జరుగుతున్న అన్ని మున్సిపాలిటీలోనూ జాగృతి పోటీ చేయనున్నట్లు సమాచారం. జాగృతి పార్టీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ కావడానికి ఇంకొక నాలుగు ఐదు నెలల సమయం పడుతుంది. ఈనెల 27న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో అంత సమయం లేనందున సింహం గుర్తుతో పోటీకి దిగాలని కవిత నిర్ణయించుకున్నారు.
అయితే సింహం గుర్తుతో పోటీ చేయనున్న కవిత అభ్యర్థులు ఎవరి ఓట్లను మింగేయనున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇది ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను చీలుస్తుందా.. లేక అధికార పార్టీ ఓట్లను కొళ్లగొడుతుంతా అనేది సస్పెన్స్గా మారింది. మున్సిపల్ ఎన్నికల బరిలో అటు జాగృతి అభ్యర్థులు కూడా పోటీ చేయడంతో దీనిపై ఇటు గులాబీ పార్టీలో కూడా తీవ్ర చర్చ జరుగుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
