AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం కన్హా శాంతివనం: జగదీప్ ధన్‌ఖర్

ప్రపంచశాంతి కోసం దేశ, విదేశాల నుండి ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వందలాదిగా తరలిరావడంతో కన్హా శాంతివనంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భారతదేశంతో పాటు వివిధ దేశాల్లోని హిందూ, బౌద్ధ, జైన, సిక్కు సంప్రదాయల అధ్యాత్మిక గురువులు ఈ మహ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం కన్హా శాంతివనం: జగదీప్ ధన్‌ఖర్
Jagdeep Dhankar
Ravi Kiran
|

Updated on: Mar 16, 2024 | 9:36 PM

Share

ప్రపంచశాంతి కోసం దేశ, విదేశాల నుండి ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వందలాదిగా తరలిరావడంతో కన్హా శాంతివనంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భారతదేశంతో పాటు వివిధ దేశాల్లోని హిందూ, బౌద్ధ, జైన, సిక్కు సంప్రదాయల అధ్యాత్మిక గురువులు ఈ మహ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడవ రోజు కార్యక్రమంలో శాంతి కోసం పోరాడుతున్న మేధావులతో అనేక చర్చా కార్యక్రమాలు, ప్రసంగాలతో పాటు ప్రముఖ సంగీత, నృత్య కళాకారులతో కార్యక్రమాలు సాగాయి.

ఆధ్యాత్మిక కళతో సాగుతున్న గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవం 3వ రోజు భారత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్‌కర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్పిరిచువల్ ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఉప రాష్ట్రపతితో పాటు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్‌సై, తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే శంకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలోని సమస్యలు అన్నీ యుద్ధాలతో పరిష్కారం కావని.. చర్చల ద్వారా సాధ్యం అవుతుంది అని అటువైపు అడుగేసిన భారత ప్రధాని లోతైన ఆధ్యాత్మిక ఆలోచన గొప్పదని అన్నారు భారత ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్‌కర్. మంచి అభివృద్ధితో ప్రపంచ శాంతి ఆధ్యాత్మికత ద్వారా వచ్చే ఫలితాలని అన్నారు. ప్రతి ఒక్కరూ వివేకంతో కూడిన సమాజాన్ని పెంపొందిస్తూ.. ఆధ్యాత్మికతను పెంచేవిధంగా కృషి చేయాలి అని ఉపరాష్ట్రపతి అన్నారు.

‘వసుధైక కుటుంబం’గా ఉన్న భారతదేశం వైపు ప్రపంచదేశాల అడుగులు పడుతున్నాయని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతున్న అనేక సమస్యలపై ఈ మహోత్సవంలో పరిష్కారం కనిపించేలా కార్యక్రమం జరిగింది. భారతదేశం విదేశీ దండయాత్రలను చూసిందని.. సాంఘిక దురాచారాలను తరిమికొట్టే తత్వవేత్తలు మన దేశంలో ఉన్నారని అన్నారు. ప్రపంచం మొత్తం ఆరోగ్యం, యోగా కోసం భారతదేశం వైపు చూస్తోంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కేంద్ర సాంస్కృతిక శాఖకు అభినందనలు. ఇక్కడి సంస్కృతి, యోగా, కల్చర్ వీటిన్నంటిని తెలుసుకునేందుకు అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. మన కల్చర్ తియ్యదనాన్ని, గొప్పతనాన్ని తెలిసేలా చేయాల్సిన బాధ్యత మనకు ఎంతైనా అవసరం ఉందని అన్నారు గవర్నర్ తమిళ్‌సై.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..