AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: హైదరాబాద్ దేశానికి అతిపెద్ద ఆర్థిక కేంద్రం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమ్మట్‌ ఘనంగా ప్రారంభమైంది.. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించి కీలక ఉపన్యాసం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందని అన్నారు. అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయన్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు.

Kishan Reddy: హైదరాబాద్ దేశానికి అతిపెద్ద ఆర్థిక కేంద్రం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Dec 08, 2025 | 5:03 PM

Share

రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమ్మట్‌ ఘనంగా ప్రారంభమైంది.. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించి కీలక ఉపన్యాసం చేశారు. లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోందని అన్నారు. అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యమన్నారు గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ.. గవర్నర్ ప్రంసంగం అనంతరం నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. యువ సీఎం రేవంత్‌ అద్భుతాలు చేశారని.. నోబెల్‌ బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు. 20 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశారన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు.. విద్యాప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నారన్నారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు. హైదరాబాద్ దేశానికి అతిపెద్ద ఆర్థిక కేంద్రం అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలలో రాష్ట్రాల పాత్ర కీలకమన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సాయం అందిస్తామన్నారు. హైదరాబాద్ ఒక నగరం కాదు..అనేక రంగాలకు హబ్.. దేశ ఆర్థిక రంగానికి హైదరాబాద్ పిల్లర్ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచాలన్నారు. వికసిత్ భారత్ సాధనలో రాష్ట్రాలు భాగం కావాలన్నారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీఉండాలని.. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం..సురక్షితమైన దేశం అని పేర్కొన్నారు. గత పదేళ్లలో దేశం అనేక రంగాల్లో ప్రగతి సాధించిందన్నారు.  తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు.  వికసిత్‌ భారత్ 2047లో తెలంగాణది కీలకపాత్ర అని వివరించారు.

Follow Us
జస్టిస్ డెలివర్డ్ !! ముగ్గురు మృగాళ్లకు ఉరిని ఖరారు చేసిన కోర్టు
జస్టిస్ డెలివర్డ్ !! ముగ్గురు మృగాళ్లకు ఉరిని ఖరారు చేసిన కోర్టు
శబరిమల కేసులో సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఫిక్స్
శబరిమల కేసులో సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఫిక్స్
నన్నయ యూనివర్సిటీలో సెగలు రేపుతున్న విద్యార్థుల ఆందోళన
నన్నయ యూనివర్సిటీలో సెగలు రేపుతున్న విద్యార్థుల ఆందోళన
పిల్లలు ఇష్టపడే కోవా బన్.. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి!
పిల్లలు ఇష్టపడే కోవా బన్.. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి!
16 ఎపిసోడ్స్‌తో ఓటీటీని షేక్ చేస్తోన్న హారర్ థ్రిల్లర్ సిరీస్
16 ఎపిసోడ్స్‌తో ఓటీటీని షేక్ చేస్తోన్న హారర్ థ్రిల్లర్ సిరీస్
మీకూ తరచూ కడుపు నొప్పి వస్తుందా? ఆ ప్రాణాంతక వ్యాధికి సంకేతం..
మీకూ తరచూ కడుపు నొప్పి వస్తుందా? ఆ ప్రాణాంతక వ్యాధికి సంకేతం..
ఎర్ర చీరలో దోర జామ పండులా.. కీర్తీ ఎంత ముద్దుగా ఉందో కదా..
ఎర్ర చీరలో దోర జామ పండులా.. కీర్తీ ఎంత ముద్దుగా ఉందో కదా..
గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. తప్పకుండా తెలుసుకోండి!
గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. తప్పకుండా తెలుసుకోండి!
పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే ముఖ్యం
పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే ముఖ్యం
కలిసొచ్చిన కాలం.. రూ. 1 లక్ష పెట్టుబడి 22 నెలల్లోనే రూ.6 కోట్లు..
కలిసొచ్చిన కాలం.. రూ. 1 లక్ష పెట్టుబడి 22 నెలల్లోనే రూ.6 కోట్లు..