AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం.. అజారుద్దీన్‌‌, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్

తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాజీ టీమిండియా క్రికెటర్ అజారుద్దీన్‌, ఎం. కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. దీంతో అజారుద్దీన్‌, కోదండరాం ఇద్దరూ మండలికి వెళ్లడం ఖరారైంది.

గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం.. అజారుద్దీన్‌‌, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్
Kodandaram - Azharuddin
Shaik Madar Saheb
|

Updated on: Apr 25, 2026 | 1:24 PM

Share

తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాజీ టీమిండియా క్రికెటర్ అజారుద్దీన్‌, ఎం. కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. దీంతో అజారుద్దీన్‌, కోదండరాం ఇద్దరూ మండలికి వెళ్లడం ఖరారైంది. గత ఏడాది ఆగస్ట్‌ 30న ఈ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమించాలని తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. అయితే అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్‌లోనే ఉంది.

ఇప్పుడు గవర్నర్‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పరిస్థితి మారింది. ముఖ్యంగా అజారుద్దీన్‌ మంత్రి పదవి.. ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపైనే ఆధారపడి ఉండటంతో తాజా నిర్ణయంతో ఆయన మంత్రిగా కొనసాగడం స్పష్టమైంది.

స్వయంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

తెలంగాణ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న అజారుద్దీన్.. పదవిలో కొనసాగాలంటే ఏప్రిల్ 30 లోపు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికవ్వడం తప్పనిసరి.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వారు ఆరు నెలల లోపు ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాల్సి ఉంది.. ఒకవేళ ఏప్రిల్ 30 లోపు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే అజారుద్దీన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే.. ఇంతకాలం గవర్నర్ కోటాలో పెండింగ్ లో ఉన్న అజారుద్దీన్, కోదండరాం పేర్లను పరిశీలించాలని.. గ్రీన్ సిగ్నన్ ఇవ్వాలని.. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి సుధీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే.. వారి అభ్యర్థిత్వాలకు గవర్నర్ ఆమోదించారు..

Follow Us