AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RapidEVChargeE: ఎలక్ట్రిక్‌ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌.. ర్యాపిడ్‌ ఈవీ చార్జింగ్ యూనిట్‌!

RapidEVChargeE: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్‌ వాహనాలకు తగినట్లుగానే చార్జింగ్‌ పాయింట్లు కూడా..

RapidEVChargeE: ఎలక్ట్రిక్‌ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌.. ర్యాపిడ్‌ ఈవీ చార్జింగ్ యూనిట్‌!
Subhash Goud
|

Updated on: Apr 19, 2022 | 9:52 PM

Share

RapidEVChargeE: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్‌ వాహనాలకు తగినట్లుగానే చార్జింగ్‌ పాయింట్లు కూడా క్రమ క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇందుకు సంబంధించి సాప్ట్‌వేర్‌ అప్లికేషన్ల తయారీ కంపెనీ ర్యాపిడ్‌ ఈవీచార్జ్‌ఈ హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల (Electric vehicles) చార్జర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ఫౌండర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శివసుబ్రమణియం వెల్లడించారు. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 600 వరకు చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

2026 నాటికి రెండు మిలియన్ల ఎలక్ట్రిక్‌ వాహనాల అవసరాలను తీర్చడానికి భారతదేశంలో దాదాపు 4 లక్షల వరకు చార్జింగ్‌ స్టేషన్లు అవసరమని అంచనా వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కోయంబత్తూరులో ఉన్న ప్లాంట్‌లో చార్జర్లు తయారవుతున్నాయని, వీటికి డిమాండ్‌ పెరుగుతుండటంతో ఫ్రాంచైజ్‌ పద్దతిన ఉత్పత్తి చేయడం అంత సులువుకాదని తెలిపారు. చార్జింగ్‌ స్టేషన్ల కొరతను తీర్చేందుకు కంపెనీ తెలంగాణతో పాటు ఏపీలోనూ వచ్చే ఏడాదిన్నర కాలంలో వెయ్యి చార్జింగ్‌ స్టేషణ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

చార్జింగ్‌ టారిఫ్‌ను రూ.8 నుంచి రూ.25 మధ్యలో నిర్ణయించింది. ఎలక్ట్రిక్‌ పోల్‌ చార్జింగ్‌ స్టేషన్లు లాగా ఉండే ఈ చార్జింగ్‌ స్టేషన్లలో పవర్‌ సాకెట్‌, మినీ స్క్రీన్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌తో కూడా చార్జింగ్‌ చేసుకునే వీలుంటుంది. యాప్‌తో స్లాట్‌ బుకింగ్‌తోపాటు చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు. ఇలాంటి సదుపాయాలను ఇప్పటికే కోయంబత్తూరులో అందుబాటులో ఉండగా, త్వరలో ఇక్కడ కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

Biliti Electric: తెలంగాణలో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ ఫ్యాక్టరీ.. ప్రపంచంలోనే అతిపెద్దది..!

Sri Lanka Economic Crisis: అక్కడ భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర.. లీటర్‌కు రూ.338.. కొనసాగుతున్న ఆందోళనలు

Sri Lanka Economic Crisis: అక్కడ భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర.. లీటర్‌కు రూ.338.. కొనసాగుతున్న ఆందోళనలు