ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని నర్సు మృతి

ఈ మధ్య సెల్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. నేటి సమాజంలో సెల్‌ఫోన్ అతి ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. ఇయర్ ఫోన్స్ పెట్టకుని పాటలు వింటూ రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన‌ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన రేఖ‌(25) ఖైరతాబాద్‌‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. గురువారం ఉదయం జిమ్‌కు వెళ్లిన రేఖ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఇంటికి బయలుదేరింది. ఖైరతాబాద్ ఎల్‌సీ గేట్-40 వద్ద పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. […]

ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని నర్సు మృతి
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 10:26 AM

ఈ మధ్య సెల్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. నేటి సమాజంలో సెల్‌ఫోన్ అతి ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. ఇయర్ ఫోన్స్ పెట్టకుని పాటలు వింటూ రైల్వే ట్రాక్ దాటుతున్న ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన‌ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

ఢిల్లీకి చెందిన రేఖ‌(25) ఖైరతాబాద్‌‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. గురువారం ఉదయం జిమ్‌కు వెళ్లిన రేఖ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ ఇంటికి బయలుదేరింది. ఖైరతాబాద్ ఎల్‌సీ గేట్-40 వద్ద పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో అటుగా వస్తున్న రైలు హారన్ వేసుకుంటూ వస్తున్నా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడంతో రేఖకు వినిపించలేదు. దీంతో రైలు ఆమెను ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో రేఖ అక్కడికక్కడే మృతిచెందింది.

రేఖ మృతి సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నాంపల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రేఖ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా చాలామంది పట్టించుకోకుండా ప్రాణాలు కోల్పోతున్నారని రైల్వే పోలీసులు చెబుతున్నారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?