RGAI-Metro: ఎయిర్‌పోర్ట్ వరకూ మెట్రో కనెక్టివిటీ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే.. 500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న జీఎమ్మార్!

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RGIA) ను నిర్వహిస్తున్న జీఏంఆర్ గ్రూప్ నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో

RGAI-Metro: ఎయిర్‌పోర్ట్ వరకూ మెట్రో కనెక్టివిటీ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే.. 500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న జీఎమ్మార్!
Metro Link Porject To Rgai
Follow us

|

Updated on: Sep 01, 2021 | 3:59 PM

RGAI-Metro: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RGIA) ను నిర్వహిస్తున్న జీఏంఆర్ గ్రూప్ నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన రూ .5000 కోట్ల మెట్రో రైల్ లింక్ ప్రాజెక్ట్‌లో రూ .500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ

జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్ ఏప్రిల్ 2021 నుంచి మర్చి 2026 వరకూ తన మూడో కంట్రోల్ పిరియడ్ కోసం టారిఫ్ రివిజన్ ను ఎయిర్‌పోర్ట్‌ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీకి సమర్పించింది. దాని ప్రకారం జీఎమ్మార్ 2024 నాటికి మెట్రో ప్రాజెక్ట్ లో 519.52 కోట్లు పెట్టనుంది. మొత్తం మెట్రో రైల్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 5000 కోట్లు కాగా, అందులో పదిశాతం అంటే 500 కోట్ల రూపాయలను జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్ భరిస్తుంది. ఈ మొత్తం విమానాశ్రయంలోని మెట్రో కనెక్టివిటీ అంచనా వ్యయంతో సమానం అని కన్సల్టేషన్ పేపర్ పేర్కొంది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ యొక్క రెండవ దశ కింద నగరంలోని వివిధ ప్రాంతాల నుండి మెట్రో రైలు లింక్‌ను RGIA కి పొడిగించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రత్యేక ఏర్పాటును దీనికోసం చేసింది. దాని ప్రకారం హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో లిమిటెడ్ (HAML), విమానాశ్రయ మెట్రో లింక్ అభివృద్ధి, నిర్మాణం, కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యత వహిస్తుంది.

ప్రణాళికాబద్ధమైన విమానాశ్రయ మెట్రో లింక్ మొత్తం సుమారు 31 కి.మీ. RGIA ప్రాంగణంలో మూడు మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు ఎనిమిది కి.మీ.ల అలైన్‌మెంట్ అభివృద్ధిని ఈ ప్రణాళికలో ప్రస్తావించారు. HIAL పౌర విమానయాన మంత్రిత్వ శాఖను పైన పేర్కొన్న మూలధన సహకారాన్ని ఏరోనాటికల్ ఆస్తిగా పరిగణించాలని, ఏరోనాటికల్ ఛార్జీల నిర్ధారణ కొరకు RAB (రెగ్యులేటరీ అసెట్ బేస్) నిర్ధారణలో చేర్చాలని కోరింది.

మరోవైపు కరోనా ఇబ్బందులతో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ తమ వాటాను విక్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. కీలకేతర ఆస్తులను అమ్మేస్తున్నట్టు ఎల్ అండ్ టీ ప్రకటించింది. సంస్థ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (డెవల్‌పమెంట్‌ ప్రాజెక్ట్స్‌) డీకే సేన్‌ మంగళవారం ఈ మేరకు సంకేతాలిచ్చారు. ఉత్తరాఖండ్‌లోని నాబా కోర్ ఆస్తులు 1400 మెగావాట్ (MW) నాభా థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను విక్రయించాలని యోచిస్తోంది. ఎల్‌అండ్‌టీకి చెందిన 99 మెగావాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టును రెన్యూ పవర్‌ కంపెనీకి విక్రయించిన విషయాన్ని వెల్లడిస్తూ విడుదల చేసిన ప్రకటనలో సేన్‌ ఈ విషయం తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటైన హైదరాబాద్‌ మెట్రోలో ఎల్‌అండ్‌టీకి 90 శాతం వాటా ఉండగా, 10 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ మేరకు విడుదల చేసిన జాబితాలో హైదరాబాద్ మెట్రోతో పాటు ఇతర ఆస్తుల వివరాలు కూడా ఉన్నాయి. ఒకవైపు మెట్రోను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూనే మరోవైపు రుణాల కోసం సంస్థ ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.

కరోనాతో పాటు అప్పుల కారణంగా ఎల్ అండ్ టీపై భారం పెరిగింది. మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,571 కోట్లు కాగా.. వివిధ కారణాలతో రూ.18,971 కోట్లకు అంచనాలు చేరాయి. అయితే అప్పుల ద్వారా సేకరించిన మొత్తం రూ.13,500 కోట్లు ఉన్నాయి. 2019 – 20లో రూ.383 కోట్ల నష్టాలను చవిచూసింది. 2020 21లో ఏకంగా రూ.1,766 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. ఈ మేరకు సంస్థ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీకే సేన్‌ సంకేతాలిచ్చారు. అయితే, ఇందులో పూర్తి వాటాను విక్రయిస్తారా? లేక కొంత వాటానా? అన్నది మాత్రం సేన్‌ వెల్లడించలేదు.

Also Read: GDP Growth: భారత్ జీడీపీ రికార్డు పరుగులు.. జీడీపీ పెరిగితే లాభం ఏమిటి? అసలు జీడీపీని ఎలా లేక్కేస్తారు? తెలుసుకోండి!

September 1: కస్టమర్లు అలర్ట్‌: నేటి నుంచి ఈ నిబంధనలు మారుతున్నాయ్‌.. తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలివే..

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!