AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అన్యాయంగా ప్రాణం తీశారు కదరా..! నడుస్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన కారు.. భయంకర వీడియో

మద్యం మత్తు.. అతివేగం, నిర్లక్ష్యం.. నిండు ప్రాణాలను తీస్తున్నాయి.. రోడ్డు పై కొందరు చేసే అరచకాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా.. హైదరాబాద్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది.. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రాణాలను తీసింది..

Watch: అన్యాయంగా ప్రాణం తీశారు కదరా..! నడుస్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన కారు.. భయంకర వీడియో
Car Accident
Shaik Madar Saheb
|

Updated on: Aug 11, 2024 | 1:33 PM

Share

మద్యం మత్తు.. అతివేగం, నిర్లక్ష్యం.. నిండు ప్రాణాలను తీస్తున్నాయి.. రోడ్డు పై కొందరు చేసే అరచకాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా.. హైదరాబాద్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది.. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రాణాలను తీసింది.. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ అతివేగంతో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టగా.. అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్‌ నగర పరిధిలోని గాజులరామరంలో చోటుచేసుకుంది.

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో ఈ ఘటన జరిగింది.. అతివేగం, మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కారులో వస్తున్నారు.. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును కారు ఢీకొట్టింది.. గోపి (38) అనే సెక్యూరిటీ గార్డు స్పాట్ లోనే మృతి చెందాడు..

వీడియో చూడండి..

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.. ఈ ఘోర ప్రమాదం.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని.. తాగి డ్రైవ్ చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..