బాధితులకు అండగా నిలిచిన ఉద్యోగుల జేఏసీ

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు తెలంగాణ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి (ఉద్యోగుల జేఏసీ) అండగా నిలిచింది. తమ అక్టోబరు నెల వేతనాల...

బాధితులకు అండగా నిలిచిన ఉద్యోగుల జేఏసీ

Updated on: Nov 02, 2020 | 11:00 PM

తెలంగాన ఉద్యోగుల జేఏసీ పెద్ద మనసును చాటుకుంది. హైదరాబాద్‌లో భారీగా కురిసిన వర్షల బాధితులకు అండగా నిలిచారు. తమ వంతు సహాయాన్ని అందించారు. ఒక రోజు జీతాన్ని బాధితులకు అందించాల్సిందిన ప్రభుత్వాన్ని వారు కారారు.

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు తెలంగాణ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి (ఉద్యోగుల జేఏసీ) అండగా నిలిచింది. తమ అక్టోబరు నెల వేతనాల నుంచి ఒక రోజు మూల వేతనాన్ని మినహాయించుకుని బాధితులకు అందించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ఇందుకు స్పందించిన ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ క్రమంలో… ఉద్యోగుల అక్టోబరు నెల వేతనాల నుంచి ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్వం మినహాయించింది. ఈ డబ్బును బాధితులకు అందించనుంది.