హైదరాబాద్ లో ఘనంగా శ్రీ భూ వరాహస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన!

| Edited By: Srinu

Dec 02, 2019 | 5:11 PM

హైదరాబాద్ పుప్పాలగూడ లోని మైహోమ్ అవతార్ అపార్ట్ మెంట్లో శ్రీ భూ వరాహస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతులమీదుగా శ్రీ భూ వరాహస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ జీయర్ స్వామితో పాటు మై హోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వర రావు కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు ఈ వైదిక కార్యక్రమానికి హాజరయ్యారు. […]

హైదరాబాద్ లో ఘనంగా శ్రీ భూ వరాహస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన!
Follow us on

హైదరాబాద్ పుప్పాలగూడ లోని మైహోమ్ అవతార్ అపార్ట్ మెంట్లో శ్రీ భూ వరాహస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతులమీదుగా శ్రీ భూ వరాహస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ జీయర్ స్వామితో పాటు మై హోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వర రావు కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు ఈ వైదిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో దిషా ఘటనపై కూడా స్పందించారు చినజీయర్ స్వామి. చట్టాలు కఠినతరం చేయాలని చెప్పారు. దిషా కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.