Hyderabad: హైదరాబాదీయులకు కరోనా భయం పోయినట్లేనా.. సగం మందిలో యాంటీబాడీలు.. సర్వేలో తేలిన వివరాలు..
Corona In Hyderabad: కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం సోషల్ డిస్టెంట్స్ పాటించకపోవడం. మరి కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్లాంటి మహా నగరంలో సోషల్ డిస్టెంట్స్ అంత సులభంగా సాధ్యమయ్యే పనికాదు. ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత..
Corona In Hyderabad: కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం సోషల్ డిస్టెంట్స్ పాటించకపోవడం. మరి కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్లాంటి మహా నగరంలో సోషల్ డిస్టెంట్స్ అంత సులభంగా సాధ్యమయ్యే పనికాదు. ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఒకేసారి జనాలు రోడ్లపైకి వచ్చారు. మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కేసులు విపరీతంగా పెరగాలి కదా.. కానీ అంతలా పెరగలేవు. ఈ క్రమంలోనే తాజాగా భాగ్యనగరంలో నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పట్నంలో సగానికిపైగా మందికి ఇప్పటికే కరోనా వచ్చి వెళ్లిపోయిందని ఈ సర్వేలో తేలింది. నగరంలో ఏకంగా 54 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు సీసీఎంబీ, భారత్ బయోటెక్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో తేలింది. హైదరాబాద్లోని 30 వార్డుల్లో సుమారు 9 వేల మంది నుంచి సేకరించిన శాస్ర్తవేత్తలు పరీక్షలు నిర్వహించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇక యాంటీ బాడీలు ఉన్న వారిలో 56 శాతంతో మహిళలు ముందు వరుసలో ఉండగా.. పురుషులు 53 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. ఇక 70 ఏళ్లు పైబడిన 49 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందడం విశేషం. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి కుటుంబాల్లోని 78 శాతం మందికి యాంటీబాడీలు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఈ లెక్కన చూసుకుంటే హైదరాబాదీలు కరోనాను జయించినట్లేనని అర్థం చేసుకోవచ్చు. ఈ సర్వే ఆధారంగా హైదరాబాదీలు నెమ్మదిగా హెర్డ్ ఇమ్యూనిటీ వైపు అడుగులు వేస్తున్నారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: వామన్ రావు దంపతుల హత్య కేసుః ముగిసిన నిందితుల పోలీసు కస్టడీ.. ఐదో నిందితుడు లచ్చయ్య అరెస్ట్