AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. క్షణాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి..

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురై ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. వీకెండ్‌లో స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడుతుండగా వెన్నునొప్పి రావడంతో కారులో విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం కాసేపటికే కారులోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన..

Hyderabad: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. క్షణాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి..
Heart Attack
Srilakshmi C
|

Updated on: May 07, 2023 | 10:44 AM

Share

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురై ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. వీకెండ్‌లో స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడుతుండగా వెన్నునొప్పి రావడంతో కారులో విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం కాసేపటికే కారులోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఘట్టుపల్లి శివారులోని కేసీఆర్‌ క్రికెట్ స్టేడియంలో శనివారం (మే 6) చోటుచేసుకుంది. మహేశ్వరం ఎస్సై నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామమనికి చెందిన మర్రిపూడి మణికంఠ(26) ఏడాది కాలంగా కూకట్‌పల్లిలో హాస్టల్‌లో ఉంటూ కేబీహెచ్‌పీ కాలనీలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడి సోదరుడు వెంకటేష్‌ కేబీహెచ్‌పీ కాలనీలో నివాసం ఉంటూ స్టాప్ట్‌వేర్‌ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నాడు. మృతుడి సొదరుడు వెంకటేష్‌ మీడియాతో మాట్లాడుతూ..

వారాంతంలో తామిద్దరం మరికొంతమంది స్నేహితులతో కలిసి స్టేడియంలో క్రికెట్ ఆడుతుంటామని తెలిపారు. ఎప్పటిమాదిరిగానే శనివారం ఉదయం ఘట్టుపల్లి శివారులోని స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వెళ్లామన్నాడు. మణికంఠ బ్యాటింగ్‌ అనంతరం ఒకే ఓవర్‌ బౌలింగ్‌ వేసి వెన్నునొప్పి వస్తుందంటూ విశ్రాంతి కోసం కారులో పడుకున్నట్లు చెప్పాడు. కాసేపటి తర్వాత వెళ్లి మణికంఠను పిలిచినా పలకకపోవడంతో వెంటనే మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించామన్నారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మణికంఠ మృతి చెందినట్లు నిర్ధారించారని మృతుడి సోదరుడు వెంకటేష్‌ తెలిపారు. మణికంఠ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై నర్సయ్య తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం