AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వచ్చిన సమాచారం నిజమైంది.. ఆ వాహనాన్ని ఆపగానే ఒకరు పారిపోయారు.. లోపల చెక్ చేయగా

హైదరాబాద్‌లో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పటాన్‌చెరు పరిధిలో 50లక్షల విలువైన గంజాయి పట్టుపడడం కలకలం రేపుతోంది.

Hyderabad: వచ్చిన సమాచారం నిజమైంది.. ఆ వాహనాన్ని ఆపగానే ఒకరు పారిపోయారు.. లోపల చెక్ చేయగా
Ganja Seized
Ram Naramaneni
|

Updated on: Apr 09, 2023 | 6:36 PM

Share

గుట్టుచప్పుప్పుడు కాకుండా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని పటాన్‌చెరు పరిధిలోని రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఎస్ఓటి, రామచంద్రాపురం పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 120 కేజీల గంజాయి పట్టుపడింది. మేడ్చల్‌కు చెందిన నిందితులు ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలించే ప్రయత్నం చేసినట్టుగా మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. నిందితులు ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి ప్రాంతంలోని స్థానిక గంజాయి సాగుదారుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాల్లోని గంజాయి విక్రయదారులకు సరఫరా చేస్తున్నారని వివరించారు.

నిందితులు గంజాయిని కిలో రూ. 4,000/-  లెక్కన కొని.. వినియోగదారులకు రూ. కిలోకు 30,000 రూపాయలకు అమ్ముతున్నట్లు వివరించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 50 లక్షల వరకూ ఉంటుందని చెప్పారు. దాంతోపాటు.. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ముగ్గురు నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..