Hyderabad: పాదచారులకు గుడ్ న్యూస్.. అక్కడ 3D ఫుట్ ఓవర్ బ్రిడ్జ్.. ఎన్నో సౌకర్యాలు

GVK మాల్ జంక్షన్ ఎంత బిజీగా ఉంటుందో నగరవాసులకు చెప్పాల్సిన పనిలేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం అక్కడ రోడ్లు దాటే పాదచారులకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఆ కష్టాలు త్వరలో తొలగిపోనున్నాయి.

Hyderabad: పాదచారులకు గుడ్ న్యూస్.. అక్కడ 3D ఫుట్ ఓవర్ బ్రిడ్జ్.. ఎన్నో సౌకర్యాలు
Foot Over Bridge
Follow us

|

Updated on: Sep 24, 2022 | 3:46 PM

Telangana: హైదరాబాద్ మహానగరంలో మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి రానుంది. అయితే ఇది అన్నింటికంటే డిఫరెంట్.  కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బంజారా హిల్స్(Banjara Hills) రోడ్ నెంబర్ 1లోని GVK మాల్ వద్ద రూ. 5 కోట్ల రూపాయల వ్యయంతో త్రీడీ ఎఫెక్ట్‌తో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. GVK మాల్ వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గతంలో ఇదే ప్రాంతంలో అనేక ప్రమాదాలు సంభవించాయి. వాణిజ్య సముదాయాలు, మాల్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో  ప్రజలు రోడ్డు దాటే సందర్భంగా పలు ప్రమాదాలు సంభవిస్తున్న దృష్ట్యా అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని నిర్మాణం కోసం రూ. 5 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. నూతన టెక్నాలజీతో ఆకర్షణీయంగా బ్రిడ్జి నిర్మాణం చేయనున్నారు. మైల్డ్ స్టీల్‌తో సుమారు 55 (54.97) అడుగుల విస్తీర్ణంతో  చేపట్టే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వలన ప్రజల సులభతరంగా రోడ్డు దాటే అవకాశం ఏర్పడుతుంది. ఈ బ్రిడ్జికి రెండు వైపులా ఎస్కలేటర్స్ ఉంటాయి.  ఇరువైపులా 10 మంది కెపాసిటీ గల రెండు లిఫ్టులు, 8 సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఫుట్ పాత్ అంచున  సీలింగ్, క్లాడింగ్  ఏర్పాటు చేస్తారు. 3 డి ఎఫెక్ట్ తో అధునాతన పద్ధతిలో దీని నిర్మాణం చేపడుతున్నారు.  GVK మాల్ వద్ద నిర్మించే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వలన పాదచారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు దాటే  అవకాశం ఉంటుంది.

Foot Over Bridge 2

పాదచారుల ప్రయోజనం కోసం GHMC పరిధిలో ఇప్పటికే ఎన్నో  ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో…  వాణిజ్య సముదాయాలు, మాల్స్ ఉన్న ప్రదేశాలలో పాదచారులు ఇరువైపులా  వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇరువైపులా  రోడ్డు దాటే సందర్భంలో  ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి ప్రమాదాల నివారణ కోసం ఖర్చుకు వెనుకాడకుండా.. జిహెచ్ఎంసి, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎంతో కృషి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పాదచారులను దృష్టిలో పెట్టుకొని ఇరువైపులా రోడ్డు దాటేందుకు ఇప్పటికే  సుమారు 43  పైగా  పనులు చేపట్టారు. అందులో 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి అయ్యాయి. మరో 4 చోట్ల వివిధ కారణాల వలన పనులు చేపట్టలేదు. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటితో పాటు సుమారు 33 కోట్ల వ్యయంతో పాదాచారుల కోసం 12 జంక్షన్ల అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు. సుందరీకరణ, గార్డెన్, కూర్చోడానికి కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. కొన్ని పనులు కొన్ని టెండర్ దశలో ఉండగా.. మరికొన్ని టెండర్ ప్రక్రియ పూర్తై పనులు కూడా  ప్రారంభం అయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?