కొత్త సెక్రటేరియట్ కట్టాల్సిందే.. కేబినెట్‌ సబ్ కమిటీ రిపోర్ట్

తెలంగాణ సచివాలయానికి సంబంధించి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తమ రిపోర్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేసింది. ఆగష్టు 28న టెక్నికల్ టీమ్ అందించిన రిపోర్టును పరిశీలించిన కేబినెట్ సబ్ కమిటీ.. తమ తుది రిపోర్టును కేసీఆర్‌కు అందించింది. అందులో ప్రస్తుతం ఉన్న సచివాలయంలో మార్పులు, చేర్పులు చేయడం సాధ్యం కాదని.. ఫైర్ సేఫ్టీ, ఎన్‌బీసీ, ఐజీబీసీ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని తెలిపేలా కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించాలని తెలిపింది. పాత సెక్రటేరియట్ స్థలం సరిపోదని, అనువైన […]

కొత్త సెక్రటేరియట్ కట్టాల్సిందే.. కేబినెట్‌ సబ్ కమిటీ రిపోర్ట్
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 9:02 AM

తెలంగాణ సచివాలయానికి సంబంధించి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తమ రిపోర్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేసింది. ఆగష్టు 28న టెక్నికల్ టీమ్ అందించిన రిపోర్టును పరిశీలించిన కేబినెట్ సబ్ కమిటీ.. తమ తుది రిపోర్టును కేసీఆర్‌కు అందించింది. అందులో ప్రస్తుతం ఉన్న సచివాలయంలో మార్పులు, చేర్పులు చేయడం సాధ్యం కాదని.. ఫైర్ సేఫ్టీ, ఎన్‌బీసీ, ఐజీబీసీ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని తెలిపేలా కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించాలని తెలిపింది. పాత సెక్రటేరియట్ స్థలం సరిపోదని, అనువైన వసతులు, పార్కింగ్ స్థలం, భద్రత లేదని కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొంది. దీంతో పాటు అత్యంత ముఖ్యంగా భవనాలు ఇరుకుగా ఉన్నాయని, భవిష్యత్‌లో ఇవి సురక్షితం కాదని తెలిపింది.

అయితే ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్‌ను మార్చేయాలన్న ఉద్దేశంతో ఎర్రమంజిల్‌లో రూ.400కోట్లతో కొత్త సచివాలయం, రూ.100 కోట్లతో కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై కాంగ్రెస్ సుప్రీం కోర్టుకు వెళితే.. బీజేపీ నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై అధ్యయం చేసేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని వేయగా.. వారు ఆగష్టు 28న తమ నివేదికను ఇచ్చారు.