AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కులాల కురుక్షేత్రంగా తెలంగాణ దంగల్.. సామాజిక సమీకరణాలనే నమ్ముకున్న ప్రధాన పార్టీలు..

తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచారంపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టాయి ప్రధానపార్టీలు. ముఖ్యంగా సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయ వర్గాలకు దగ్గరయ్యేందుకు సరికొత్త నినాదాలు, విధానాలు ప్రకటిస్తున్నాయి. బీసీలకే సీఎం ఇస్తామని బీజేపీ అంటే... రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ అంటోంది. ఎస్సీ వర్గాలను ఆకట్టుకోవడానికి మోదీ రంగంలో దిగితే..

కులాల కురుక్షేత్రంగా తెలంగాణ దంగల్.. సామాజిక సమీకరణాలనే నమ్ముకున్న ప్రధాన పార్టీలు..
Big News Big Debate
Ravi Kiran
|

Updated on: Nov 10, 2023 | 7:08 PM

Share

తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచారంపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టాయి ప్రధానపార్టీలు. ముఖ్యంగా సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయ వర్గాలకు దగ్గరయ్యేందుకు సరికొత్త నినాదాలు, విధానాలు ప్రకటిస్తున్నాయి. బీసీలకే సీఎం ఇస్తామని బీజేపీ అంటే… రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ అంటోంది. ఎస్సీ వర్గాలను ఆకట్టుకోవడానికి మోదీ రంగంలో దిగితే.. డిక్లరేషన్ల పేరుతో బీసీ, మైనార్టీలకు భారీ వరాలు ప్రకటించింది హస్తం పార్టీ. కాంగ్రెస్, బీజేపీలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఆయా వర్గాలకు డిక్లరేషన్లను ప్రకటించిన కాంగ్రెస్ నిన్నమైనార్టీ, ఇవాళ బీసీ డిక్లరేషన్లు విడుదల చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా వర్గాలకు భారీగానే హామీలు గుప్పించింది పార్టీ. మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ అమలు చేస్తామంటోంది హస్తం పార్టీ. కులగణన చేసి బీసీలతో పాటు మైనార్టీలకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామంటోంది కాంగ్రెస్. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన చేపట్టి బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఇవాళ హామీ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42శాతం ఇస్తామని.. ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు, లిక్కర్‌ వ్యాపారంలో కోటాతో పాటు, ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేస్తామంటోంది కాంగ్రెస్…

ఇప్పటికే బీసీ సీఎం నినాదంతో బీజేపీ స్పీడు పెంచింది. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్‌ 23 మందికి మాత్రమే బీసీలకు సీట్లు కేటాయిస్తే 36 మందికి అవకాశం ఇచ్చింది కమలం పార్టీ. ఇక పరేడ్ గ్రౌండ్స్ లో రేపు మాదిగ విశ్వరూప సభ నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. ఈ సభకు ప్రధాని మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలు కూడా హాజరవుతున్నారు. ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు కీలక ప్రకటన చేయబోతున్నారు. ప్రధాని మోదీ వచ్చి ఎన్ని సభలు, సమావేశాలు పెట్టినా ఒక్కసీటు కూడా బీజేపీ గెలవదంటోంది బీఆర్‌ఎస్‌. ఇక ఓట్ల కోసం బీసీ, మైనార్టీల మధ్య కాంగ్రెస్‌ చిచ్చు పెడుతుందని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఆయా వర్గాలకు మైనార్టీ హోదా ఉండగా మళ్లీ కులగణన చేసి కోటా ఇస్తామంటూ డిక్లరేషన్‌లో పెట్టడం ద్వారా కులాల మధ్య పంచాయితీ పెడుతున్నారని మండిపడ్డారు మంత్రి. డిక్లరేషన్‌లో అంశాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మొత్తానికి సీట్లు విషయంలో మాట తప్పిన పార్టీలు ఓట్ల వేటలో మాత్రం ఆయా సామాజిక వర్గాలకు దగ్గరయ్యేందుకు రకరకాల వరాలు ఇస్తున్నాయి. అంతేకాదు తెలంగాణ ఎన్నికలను ఓ రకంగా కులాల కురుక్షేత్రంగా మార్చే ప్రయత్నం జరుగుతుందన్న విమర్శలూ ఉన్నాయి. మరి తెలంగాణలో క్యాస్ట్‌ ఈక్వేషన్లు పార్టీలకు కలిసొస్తాయా?

Follow Us
తిరుమల దర్శనాలపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై
తిరుమల దర్శనాలపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై
భారత్‌లో జింబాబ్వే ఆఖరి మ్యాచ్ ఆడినప్పుడు ఇషాన్, అభిషేక్ వయసెంత ?
భారత్‌లో జింబాబ్వే ఆఖరి మ్యాచ్ ఆడినప్పుడు ఇషాన్, అభిషేక్ వయసెంత ?
స్మశానంలో క్షుద్రపూజల బ్యాచ్ అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే
స్మశానంలో క్షుద్రపూజల బ్యాచ్ అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే
హనీమూన్‌కు ఫారెన్ వెళ్తున్నారా?.. ఇవి అస్సలు మర్చిపోవద్దు!
హనీమూన్‌కు ఫారెన్ వెళ్తున్నారా?.. ఇవి అస్సలు మర్చిపోవద్దు!
టీమిండియా ఖాతాలో అత్యంత ఘోరమైన రికార్డు
టీమిండియా ఖాతాలో అత్యంత ఘోరమైన రికార్డు
మార్చి 1 నుంచి యూటీఎస్ యాప్ బంద్.. ఇకపై టికెట్లు బుకింగ్ ఇందులోనే
మార్చి 1 నుంచి యూటీఎస్ యాప్ బంద్.. ఇకపై టికెట్లు బుకింగ్ ఇందులోనే
రెండు కనుబొమ్మలు కలిస్తే రెండు పెళ్లీలు అవుతాయా?
రెండు కనుబొమ్మలు కలిస్తే రెండు పెళ్లీలు అవుతాయా?
ఘోర ప్రమాదం.. ట్యాంకర్ ఢీకొని ర్యాపిడో డ్రైవర్, యువతి మృతి!
ఘోర ప్రమాదం.. ట్యాంకర్ ఢీకొని ర్యాపిడో డ్రైవర్, యువతి మృతి!
భారత్ కు షాక్.. సఫారీ దెబ్బకు 1200 రోజుల రికార్డ్ బ్రేక్
భారత్ కు షాక్.. సఫారీ దెబ్బకు 1200 రోజుల రికార్డ్ బ్రేక్
క్రెడిట్ కార్డులు వాడేవారికి కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి..
క్రెడిట్ కార్డులు వాడేవారికి కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి..