AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పెళ్లాం వేధిస్తుందంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి మొగుడు ఏడుపులు

భార్య టార్చర్ ఎక్కువ అయిందంటూ భర్త వాటర్ ట్యాంక్ ఎక్కాడు. తనకు న్యాయం చేసేవరకు దిగనంటూ పట్టుబట్టాడు. చివరకు ఏం జరిగిందంటే..?

Telangana: పెళ్లాం వేధిస్తుందంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి మొగుడు ఏడుపులు
Suicide Attempt
Ram Naramaneni
|

Updated on: Mar 29, 2023 | 10:13 PM

Share

ఆలుమగలు మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ టీ కప్పులో తుఫాన్ లెక్క అనమాట. కానీ మరీ ఇగోలకు పోతే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. తాజాగా  జనగామ జిల్లాలో అలాంటి ఘటనే వెలుగుచూసింది.  భార్య తరచూ పొలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి వేదిస్తుందని ఓ బాధితుడు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. చిలుపూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి.. తన భార్య తరచూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని వాటర్ ట్యాంక్ ఎక్కాడు.

తన సమస్య పరిష్కరించకుంటే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కుల పెద్దలు, పోలీసులు సమస్య పరిష్కరించకుంటే తాను బతికి ఉండలేనని భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో హైటెన్షన్ నెలకుంది. సమాచారం అందడంతో పోలీసులు స్పాట్‌కు చేరుకున్నాడు. రాజుకు పలు విధాల నచ్చజెప్పి కిందకు దింపారు. భార్యభర్తలిద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం