AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గరిష్ఠ స్థాయికి చేరుకున్న తెలంగాణ విద్యుత్ డిమాండ్.. ఒకే రోజులో 15,497 మెగావాట్ల వినియోగం

తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం 11 గంటలకు 15,497 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గతంలో మార్చి 15న 15.062 మెగవాట్ల గరిష్ఠ స్థాయి నమోదైంది.

గరిష్ఠ స్థాయికి చేరుకున్న తెలంగాణ విద్యుత్ డిమాండ్.. ఒకే రోజులో 15,497 మెగావాట్ల వినియోగం
Electricity
Aravind B
|

Updated on: Mar 30, 2023 | 8:39 PM

Share

తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం 11 గంటలకు 15,497 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. గతంలో మార్చి 15న 15,062 మెగావాట్ల గరిష్ఠ స్థాయి నమోదైంది. ఈసారి గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ఇప్పటికే 15,497 మెగావాట్లకు చేరుకోగా..గత ఏడాది మార్చిలో గరిష్ఠంగా 14,160 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు పేర్కొన్నారు. అయితే మార్చి 15న 15,062 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ గిరిష్ఠ స్థాయికి చేరుకోగా ఆ తర్వాత వర్షం కారణంగా కొంతమేర తగ్గిందని..ఆ తర్వాత మరోసారి పెరిగినట్లు తెలిపారు.

రాబోయే రోజుల్లో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 16,000 మెగావాట్ల మార్కును అధిగమిస్తుందని..రోజువారి ఇంధన వినియోగం 300 మిలియన్ యూనిట్లకు మించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మార్చిలో గరిష్ట డిమాండ్ 15,000 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేసిన తరువాత విద్యుత్ వినియోగ శాఖ తగినంత విద్యుత్ సరఫరాకు ప్రణాళిక వేసింది. రాష్ట్ర మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో వ్యవసాయ పరిశ్రమ 37 శాతానికి పైగా విద్యుత్ ను వినియోగిస్తోంది. వేసవిలో వినియోగదారులందరికీ, ముఖ్యంగా రైతులకు నమ్మకమైన విద్యుత్‌ను పొందేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని అధికారులు వెల్లడించారు.