AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.!

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,08,696 నమూనాలను పరీక్షించగా 2384 మందికి పాజిటివ్‌గా...

తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.!
Ravi Kiran
|

Updated on: Jun 02, 2021 | 9:21 PM

Share

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,08,696 నమూనాలను పరీక్షించగా 2384 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,83,228కి చేరింది. మరో 17 మంది మహమ్మారికి బలయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 3313కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 33,379 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. అటు నిన్న 2,242 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటిదాకా మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,46,536కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ పరిధిలో 307, నల్గొండ 170, రంగారెడ్డి 135, మేడ్చల్ మల్కాజ్ గిరి 116, కరీంనగర్ 103, ఖమ్మం 167, కొత్తగూడెం జిల్లాల్లో 113 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.