YS Sharmila Political Party: వైఎస్ షర్మిలతో భేటీ.. సంచలన ప్రకటన చేసిన కాంగ్రెస్ నాయకురాలు..

YS Sharmila Political Party: తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతానంటూ ముందుకు రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి.

YS Sharmila Political Party: వైఎస్ షర్మిలతో భేటీ.. సంచలన ప్రకటన చేసిన కాంగ్రెస్ నాయకురాలు..
Follow us

|

Updated on: Mar 03, 2021 | 6:32 PM

YS Sharmila Political Party: తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతానంటూ ముందుకు రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ పోశాల లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిలను కలిశారు. ఆవిడతో భేటీ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఇందిరా.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని అన్నారు. ఓ మహిళగా, వైఎస్ షర్మిలకు మద్ధతుగా ఆమెను కలిశానని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే తత్వం తనది అని, ఇంకా పోరాడాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే అది సాధ్యమయ్యే పని కాదని ఇందిరా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగానో శ్రమించానన్న ఆమె.. పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని ఆరోపించారు. గ్రూప్ రాజకీయాలు, ఉత్తమ్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల తాను పార్టీ నుంచి బయటకు వచ్చానని వివరించారు ఇందిరా శోభన్. పని చేసినపుడు పదవి అడగడంలో తప్పులేదని, అందుకే సీటు ఆశించానని ఆమె చెప్పుకొచ్చారు. సీటు ఇవ్వకపోగా కనీసం తనను పిలిచి ఎందుకు సీటు ఇవ్వలేదన్న కారణం కూడా చెప్పలేదన్నారు. ఓడిపోయిన వాళ్ళకే సీట్లు, పదవులు ఇస్తే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని కాంగ్రెస్ పార్టీ తరుపై విమర్శలు గుప్పించారు ఇందిరా. కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్న ఆమె.. అందుకే ఆ పార్టీ ఎదగలేకపోతోందన్నారు.

వైఎస్ఆర్ పాలనలో స్వర్ణ యుగం నడిచిందన్న ఆమె.. తెలంగాణ లక్ష్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరు గారుస్తోందని దుయ్యబట్టారు. మహిళలంతా షర్మిలకు మద్దతుగా నిలబడతామని ఇందిరా ప్రకటించారు. కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలకు అడ్డాగా మారిందని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఇక కేంద్రం అండ లేకుండా ఇక్కడ కేసీఆర్ ఆటలు కొనసాగవనని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం ఉందని ఆరోపించారు. కులం, మతం, సర్జికల్ స్ట్రైక్స్ ద్వారానే బీజేపీలో ప్రజల్లోకి వెళ్తోందన్నారు. ప్రజా సమస్యలను అన్ని పార్టీలు గాలికి వదిలేసాయి కాబట్టి రాష్ట్రంలో మరో పార్టీ అనివార్యం అయ్యిందని ఇందిరా శోభన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ హక్కుల సాధనే తమ ప్రథమ పోరాటం అని షర్మిల చెప్పారని పేర్కొన్న ఇందిరా.. తన బాట కూడా అదే కావడంతో షర్మిలతో కలిసి నడవటానికి సిద్ధమయ్యానని చెప్పారు. వైఎస్ షర్మిల నుంచి తనకు ముందే ఆహ్వానం అందిందని ఆమె చెప్పారు. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నానని, తమతో కలిసి నడవాలని కోరినట్లు ఇందిరా శోభన్ తెలిపారు. ఇదే సమయంలో ఆంధ్రాకు చెందిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంపై వస్తున్న ప్రశ్నలకు ఇందిరా శోభన్ తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పారు. ‘ఎవరూ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరగలేదు. పార్టీ పెట్టడానికి రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, ప్రజల స్థితిగతులపై అవగాహన ఉంటే చాలు’ అని చెప్పుకొచ్చారు.

Also read:

Covid Vaccination: కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం.. దానిపై వున్న నియంత్రణ ఎత్తవేత

Vellore Golden Temple : శ్రీ చక్ర ఆకారంలో శ్రీపురంలోని శ్రీ మహాలక్ష్మీదేవి గోల్డెన్ టెంపుల్.. ఎలా వెళ్లాలంటే..!

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..
టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..
అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?
అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
ఇదేం ఏఐ టెక్నాలజీరా బాబు..!డిజిటల్ క్లోనింగ్ ద్వారా ఆ సమస్య ఫసక్
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
చిన్న పొరపాట్లతో తప్పదు భారీ మూల్యం.. ఇల్లు కొనేటప్పుడు..
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు