Revanth Reddy: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లాగే ఇదీ గూడుపుఠాణీ.. రూ.లక్ష కోట్ల విలువైన ORRను కొల్లగొడుతున్న రేవంత్‌ రెడ్డి

ORR టెండర్ల విషయంలో ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. IRB సంస్థకు ఇచ్చిన లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ ప్రకారం 30 రోజుల్లో 25 శాతం నిధులు చెల్లించారా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లా ఇదీ గూడు పుఠాణీ అన్నప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని బీజేపీ నేతలను నిలదీశారు రేవంత్‌.

Revanth Reddy: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లాగే ఇదీ గూడుపుఠాణీ.. రూ.లక్ష కోట్ల విలువైన ORRను కొల్లగొడుతున్న రేవంత్‌ రెడ్డి
Revanth Reddy
Follow us

|

Updated on: May 26, 2023 | 6:55 PM

ఓఆర్ఆర్ టోల్ స్కాం.. ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే పెద్దదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రూ. లక్ష కోట్ల ఆస్తిని కేవలం రూ.7 వేల కోట్లకు కట్టబెట్టారని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. 30 రోజుల్లో 25 శాతం నిధులు చెల్లించాలని కన్సెషన్ అగ్రిమెంట్లో ఉందన్నారు. అయితే, కన్సెషన్ అగ్రిమెంట్ నిజమా కాదా తేల్చాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ వెయ్యిరెట్లు పెద్దదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ. లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ. 7వేల కోట్లకు తెగనమ్మారు. ఓఆర్ఆర్ కేటీఆర్ ధన దాహానికి బలైంది. ఇందులో కేసీఆర్, కేటీఆర్ లబ్దిదారులైతే.. సూత్రాధారులు, పాత్రధారులు సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి శుక్రవారం గాంధీభవన్ లో మీడియాతో ఈ విషయాలను వెల్లడించారు. ఓఆర్ఆర్ టోల్ స్కామ్ పై కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎందుకు విచారణ జరిపించట్లేదని నిలదీశారు. గతంలో ఇదే అంశంపై..టెండర్ దక్కిన సంస్థకు అనుకూలంగా నిబంధనలు మార్చడం, బేస్ ప్రైస్ లేకుండా టెండర్లను పిలవడం, హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031తో ముగుస్తుంది ఈ నేపథ్యంలో 30 ఏళ్లకు లీజుకు ఇస్తే సమస్యలు వస్తాయి కాబట్టి అంత సుదీర్ఘ కాలం కాకుండా టెండర్ వ్యవధి ఉండాలని, అంతేకాకుండా దేశంలో ఏ రహదారి టెడంర్ అయిన 15 – 20 ఏళ్లకు మించి ఇవ్వలేదు అని ఎన్ హెచ్ఏఐ సూచించిన పట్టించుకోకుండా టెండర్ ప్రక్రియను చేపట్టిన విధానాన్ని ప్రస్తావించాను.

తనకున్న సమాచారం మేరకు టెండర్ దక్కించుకున్న సంస్థ టెండర్ మొత్తం విలువలో 10 శాతాన్ని 30 రోజుల్లోగా, మిగతా 90 శాతాన్ని 120 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి నిబంధనలు లేవని బీఆరెస్ ఎమ్మెల్యేలు నిన్న మీడియా సమావేశంలో బుకాయించారు. కానీ డబ్బు చెల్లింపుకు సంబంధించి కన్సెషన్ అగ్రిమెంట్ లో స్పష్టంగా ఈ నిబంధనలు ఉన్నాయి. అగ్రిమెంట్‌లోని 20, 21 పేజీలో మేం చెప్పిన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. తాను చెప్పింది 10 శాతమే.. కానీ వాస్తవంగా 30 రోజుల్లో 25 శాతం టెండర్ పొందిన సంస్థ చెల్లించాలి. మిగతా 75 శాతాన్ని 120 రోజుల్లో చెల్లించాలి. ఒకవేళ నిబంధనలు ఏమైనా మార్చి ఉంటే.. ఆ మార్చిన నిబంధనలు ఏంటో బయటపెట్టాలి. ఈ రోజు నేను బయట పెట్టిన కన్సెషన్ అగ్రిమెంట్ నిజమా కాదా చెప్పాల్సిన బాధ్యత అరవింద్ కుమార్, సోమేశ్ కుమార్ పై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

ఓఆర్ఆర్ టెండర్ కు సంబంధించి ఏప్రిల్ 27, 2023 లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగింది. ఈ రోజుతో 30 రోజుల గడువు ముగిసింది. అయితే రూ.7,300 కోట్లలో 25 శాతం అంటే రూ.1800 కోట్లు ప్రభుత్వానికి IRB సంస్థ చెల్లించాల్సి ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. ఇప్పటి వరకు ఐఆర్బీ సంస్థ డబ్బులు చెల్లించిందో లేదో తెలియదు. ఒక వేళ చెల్లించకుంటే నిబంధనలు ఉల్లంఘించినందుకు IRB సంస్థ టెండర్ ను రద్దు చేయాలి అని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేటీఆర్ స్పందించాలి..ఆయన విదేశీ పర్యటనలో బీజీగా ఉంటే అరవింద్ కుమార్ స్పందించాలి. దీనిపై పూర్తి బాధ్యత అరవింద్ కుమార్ పై ఉంది. ఇందుతో ఏమీ తేడా జరిగిన అరవింద్ కుమార్ ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

అయితే ఓఆర్ఆర్ టెండర్ల విషయం లక్ష కోట్లకు సంబంధించినదని.. అంత విలువైన ఆస్తిని కేవలం రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నదని రేవంత్ పేర్కొన్నారు. అయితే ఇంత బహిరంగంగానే దోపిడీ జరుగుతుంటే బీజేపీ నేతలు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఇంత పెద్ద స్కాం జరుగుతుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని.. ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు నిర్వహించడంలేదని నిలదీశారు. మరీ కేంద్ర మంత్రి హోదాలో ఉండి విచారణకు ఆదేశమివ్వని కిషన్ రెడ్డి ఎందుకు కోరడం లేదు దీని వెనక గూడుపుఠానీ ఏంటి? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రఘునందన్ ఓఆర్ఆర్ టెండర్ పై సీబీఐ కి పిర్యాదు చేశారు. సొంత ఎమ్మెల్యే ఫిర్యాదును బండి సంజయ, కిషన్ రెడ్డి నమ్ముతున్నారా లేదా స్పష్టం చేయాలి. అని రేవంత్ రెడ్డి అన్నారు. ఓఆర్ఆర్ టెండర్ వ్యవహారాన్ని అంత తొందరగా వదిలిపెట్టబోమని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?