AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. పారా బాయిల్డ్ రైస్ సేకరణకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ రైతులకు మరోసారి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రైతులకు మరోసారి మద్దతుగా నిలిచింది. 2021–22 రబీ సీజన్, 2022 -23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. తాజాగా2022–23 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి మరో 6.80 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరిస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి.

Telangana: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. పారా బాయిల్డ్ రైస్ సేకరణకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..
Para Boiled Rice From Telangana
Sanjay Kasula
|

Updated on: May 26, 2023 | 8:37 PM

Share

అన్నదాతకు గుడ్‌న్యూస్ చెప్పింది మోదీ ప్రభుత్వం. బలవర్థకమైన బియ్యం సేకరణ కార్యకలాపాలలో తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతు ఇస్తోంది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) 2022-2023 కోసం అదనంగా 6.80 LMT కేటాయింపునకు భారత ప్రభుత్వ ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఇది 2021-22 రబీ సీజన్ మరియు 2022-23 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇటీవల ఆమోదించబడిన 13.73 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ బియ్యం సేకరణకు అదనం.

తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి. ఇటీవల అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని యుద్ధప్రాతిపదికన రైతుల నుంచి ధాన్యం సేకరించి, మిల్లింగ్‌ ఆపరేషన్లు పూర్తి చేసి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందజేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

గత నెలలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌కు లేఖ రాస్తూ తెలంగాణ నుంచి దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ తనవంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి అనేకసార్లు లేఖలు, రిమైండర్‌లు రాసినా సకాలంలో బియ్యం అందించలేకపోయిన విషయం తెలిసిందే.

  • ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (KMS) 2022-2023 కోసం అదనంగా 6.80 LMT కేటాయింపును ఆహార,ప్రజా పంపిణీ శాఖ ఆమోదించింది.
  • ఇది రబీ 2021-2022, KMS 2022-2023 కోసం సేకరణ కోసం ఇప్పటికే ఆమోదించబడిన 13.73 LMTకి అదనం.
  • కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి 5 ఏప్రిల్ 2023న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు,ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయలన్‌కు లేఖ రాశారు.
  • కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తన లేఖలో రైతులకు మద్దతుగా తెలంగాణా నుండి బాయిల్డ్ బియ్యాన్ని సేకరించాలని అభ్యర్థించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి