Telangana Elections: కాంగ్రెస్‌ అభ్యర్థుల తుది జాబితా విడుదల.. ఆ సీనియర్లకు మొండి ‘చేయి’

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్‌ తుది జాబితా విడుదలైంది. శుక్రవారం (నవంబర్‌ 10) నామినేషన్లకు గడువు ముగియనుండడంతో పెండింగ్‌లో ఉన్న స్థానాలకు సంబంధించి గురువారం (నవంబర్‌ 19) రాత్రి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. పటాన్‌చెరు నుంచి టికెట్ ఆశించిన..

Telangana Elections: కాంగ్రెస్‌ అభ్యర్థుల తుది జాబితా విడుదల.. ఆ సీనియర్లకు మొండి చేయి
Congress Party

Updated on: Nov 10, 2023 | 12:10 AM

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థులతో కాంగ్రెస్‌ తుది జాబితా విడుదలైంది. శుక్రవారం (నవంబర్‌ 10) నామినేషన్లకు గడువు ముగియనుండడంతో పెండింగ్‌లో ఉన్న స్థానాలకు సంబంధించి గురువారం (నవంబర్‌ 19) రాత్రి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. పటాన్‌చెరు నుంచి టికెట్ ఆశించిన నీలం మధుకి నో చెప్పింది కాంగ్రెస్ హైకమాండ్‌. ఆయన స్థానంలో కాటా శ్రీనివాస్‌గౌడ్‌నే బరిలోకి దింపుతోంది. ఇక తుంగతుర్తి నుంచి రేపు నామినేషన్‌ వేస్తానన్న అద్దంకి దయాకర్‌ కు కూడా మొండి చెయ్యే చూపించింది కాంగ్రెస్. అక్కడ శామ్యూల్‌ను రంగంలోకి దింపుతోంది. ఇక సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. పటేల్ రమేష్‌రెడ్డిని కాదని.. దామోదర్‌రెడ్డికే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్.

కాంగ్రెస్‌ తాజాగా ప్రకటించిన అభ్యర్థులు వీరే..

  • సూర్యాపేట: రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి
  • పటాన్ చెరు: కట్టా శ్రీనివాస్ గౌడ్
  • మిర్యాలగూడ: బత్తుల లక్ష్మారెడ్డి
  • తుంగతుర్తి: మందుల సామ్యుల్ (ఎస్సీ)
  • చార్మీనార్: మహ్మద్ ముజీబ్ ఉల్ షీర్

 

ఇవి కూడా చదవండి

కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ మొదటి జాబితాను 55 మంది అభ్యర్థులతో ప్రకటించింది. ఆ తర్వాత రెండో జాబితాను 45 మంది అభ్యర్థులతో విడుదల చేసింది. 16మంది అభ్యర్థులతో మూడో జాబితాను రిలీజ్‌ చేశారు. తాజాగా పటాన్ చెరు అభ్యర్థి పేరు మార్చి మొత్తం ఐదుగురి అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. దీంతో మొత్తం 119 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్‌.

కాంగ్రెస్ విజయభేరిలో పాల్గొన్న రేవంత్ రెడ్డి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…