AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medak: ఆకలయినప్పుడు, దాహం వేసినప్పుడు అలా సరాదాగా వచ్చి వెళ్తున్నాయ్.. హడలిపోతున్న స్థానికులు

చిరుతపులి ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది.. అలాంటిది నిత్యం మనం నివసిస్తున్న ప్రాంతాల్లోకి అవి వస్తుంటే.. కాలు కూడా భయపెట్టాలి అంటే వణుకు పుడుతంది. మెదక్ జిల్లా రామయంపేట పరిసర ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. నిత్యం చిరుతలు సంచరిస్తూ ఉండటంతో ప్రాంతవాసులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు.

Medak: ఆకలయినప్పుడు, దాహం వేసినప్పుడు అలా సరాదాగా వచ్చి వెళ్తున్నాయ్.. హడలిపోతున్న స్థానికులు
Leaopard
P Shivteja
| Edited By: |

Updated on: May 14, 2025 | 1:22 PM

Share

రామాయంపేట పరిసర ప్రాంతాల ప్రజలను చిరుతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిత్యం పంట పొలాల వద్దకు వస్తూ పశువుల పై దాడులు చేస్తున్నాయి. అటవీ ప్రాంతంలో తాగునీటి సదుపాయం కల్పించకపోవడంతో చిరుతలు గ్రామాల బాట పడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే చిరుతలు… ఐదు పశువులు, ఒక దుప్పిని హతమార్చాయి. తమపైన దాడికి దిగుతాయని అటవీ ప్రాంతానికి సమీప గ్రామాల ప్రజలు, గిరిజనులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా శనివారం రాత్రి మూడు చిరుతలు కాట్రియాల తండా వద్ద ఉన్న కుంటలో నీరు తాగడానికి వచ్చి దుప్పిని చంపాయి.. అటవీశాఖ అధికారులు ఈ వేసవిలో అడవిలో వణ్యప్రాణులకు తాగు నీటి సదుపాయం కల్పించకపోవడంతో.. ఇలా గ్రామాలు,తండాలకు వచ్చి అలజడి సృష్టిస్తున్నాయి. నిజాంపేట, రామాయంపేట, కాట్రియాల, తోనిగండ్ల తండాలు అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్నాయి. వీరంతా తమ పశువులను శివారులోని బహిరంగ ప్రదేశంలో ఉంచుతారు. అలాంటి జీవాలపై దాడులకు పాల్పడుతున్నాయి చిరుతలు. గత రెండు నెలలుగా తరచూ చిరుతలు ఏదో ఒక చోట పశువులపై దాడి చేస్తున్నాయి. నెల క్రితం ఒకే రాత్రి  కొట్టంలో ఉన్న పశువులపై దాడికి పాల్పడి ఏకంగా ఐదు లేగ దూడలను చిరుతలు హతమార్చాయి. మరో వైపు వేసవిలో తాగు నీటి కోసం చిరుతలతో పాటు ఇతర జంతువులు కూడా గ్రామాలు, తండాల వద్దకు వస్తున్నాయి. వీటిని ప్రత్యక్షంగా చూస్తున్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తాజాగా మూడు రోజుల క్రితం చిరుతతో పాటు రెండు పిల్లలు కుంట వద్దకు వచ్చాయి.అదే సమయంలో తాగు నీటి కోసం వచ్చిన దుప్పిని హత మార్చాయి.. భయాందోళన చెందిన తండా గిరిజనులు ఈవిషయమై అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలిని పరిశీలించిన అధికారులు అక్కడే పంచనామా నిర్వహించి దుప్పి కళేబరాన్ని అటవీ ప్రాంతంలో దహనం చేశారు. దీంతో తండావాసులు అటవీ ప్రాంతానికి వెళ్లడానికి జంకుతున్నారు. తండాను ఆనుకొని ఉన్న జైత్య కుంటలోకి తాగునీటి కోసం చిరుతలతో పాటు ఇతర వణ్యప్రాణులు రోజూ వస్తున్నాయి.. వీటి వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పలువురు రైతులు.. చిరుతలను బంధిచాలని కోరుతున్నారు. ఇక చిరుతలు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు అధికారులు. రాత్రివేళ ఆరు బయటకు ఒక్కరే వెళ్ల వద్దు అని, వెళ్తే గుంపులుగా, కర్రలు చేతపట్టుకొని వెళ్లాలని సూచిస్తున్నారు. చిరుతలు కనిపిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.   

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!