AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తనను పెళ్లి చేసుకోవాలని చెల్లెల్లి బెదిరించాడు… ఆమె వద్దని వారించినందుకు

తనను పెళ్లి చేసుకోవాలని చెల్లెలు వరసయ్యే యువతిని బెదిరించాడు. కాదన్నందుకు కారుతో ఢీకొట్టాడు. ఇదీ కల్యాణదుర్గంలో కన్నింగ్‌ బ్రదర్‌ నిర్వాకం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Andhra Pradesh: తనను పెళ్లి చేసుకోవాలని చెల్లెల్లి బెదిరించాడు... ఆమె వద్దని వారించినందుకు
నిందితుడు గుజ్జల భాస్కర్
Ram Naramaneni
|

Updated on: Aug 03, 2022 | 10:18 PM

Share

AP Crime News: రాఖీపండుగ ముంగిట్లో ఓ రాక్షసుడి నిర్వాకం….అనంతపురం జిల్లా(Anantapur district) కల్యాణదుర్గం(Kalyandurg)లో సంచలనం రేపింది. అతని పేరు గుజ్జల భాస్కర్‌. ఊరు బుక్కరాయ సముద్రం మండలం అమ్మరాజుపేట. ఆ యువతిది కూడా అదే వూరు. పైగా ఇద్దరూ దగ్గరి బంధువులు. ఇంటి పేర్లు కూడా ఒకటే. వరుసకు ఆమెకు అన్న అవుతాడు భాస్కర్‌. అన్నయ్యగా అతన్ని ఆమె అతన్ని అభిమానిస్తే.. అతను మాత్రం ప్రేమంటూ వెకిలి వేషాలేశాడు. అన్నా చెల్లెల్ల మధ్య ఇలాంటి మాటలేంటని చాలా సార్లు గట్టిగా మందలించిందామె. విషయం పెద్దలకు తెలిసింది. వీడి టార్చర్‌ భరించలేక యువతి కుటుంబం ఉపాధి రీత్యా కళ్యాణ దుర్గం షిప్ట్‌ అయ్యారు. ఐనా భాస్కర్‌ వాళ్లను ఫాలో కావడం మానలేదు. ఏదో వంకతో తరుచు కలవడం.. ఫోన్‌ చేసి వేధించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో మూడు రోజుల కిందట స్కూటీ రిపేర్‌ కోసం బయటకు వెళ్లిందామె. అంతే షాడోలా కారులో ఫాలో అయ్యాడు. మాట్లాడే పని వుందన్నాడు. ఆమె విన్లేదు. అంతే తన తొట్టి గ్యాంగ్‌తో కలిసి ఆమెను కిడ్నాప్‌ చేశారు. పెళ్లాడుతావా ? లేదా అంటూ బెదిరింపులు… ఆమె కారులో నుంచి బయటకు దూకేసింది. కట్‌ చేస్తే కారు బోల్తా.. వాడు కూడా హాస్పిటల్‌లో. కానీ కారు బోల్తా యాక్సిడెంటల్‌‌గా జరిగింది కాదు పక్కా స్కెచ్‌… కుట్ర కోణం ఆ తరువాత వెలుగులోకి వచ్చింది. అతనితో పాటు మరో ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి.

ఈ ఘటనపై మహిళా, ప్రజా సంఘాలు, విపక్షాలు గళమెత్తాయి. పక్కా పథకంతోనే భాస్కర్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఎస్పీ కమిషన్‌ మెంబర్‌ వడిత్యా శంకర్ నాయక్ బాధితురాల్ని, ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా వుంటుందన్నారు. నిందితులు ఎంతటివారైనా చట్టం ప్రకారం వారిపై కఠినచర్యలు తీసుకునే వరకు పోరాడుతామన్నారాయన. బాధిత యువతికి ప్రస్తుతం ఒక ఆపరేషన్‌ పూర్తయింది. మరో రెండు ఆపరేషన్లు చేయాలంటున్నారు డాక్టర్లు. మరోవైపు దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు .వావి వరుసలు మరిచి..చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని వేధించిన మృగాడు గుజ్జల భాస్కర్‌పై ఎలాంటి చర్యలుంటాయి? బాధిత కుటుంబానికి న్యాయం ఏ దిశలో? అనేది ఇప్పుడు చర్చగా మారింది కళ్యాణదుర్గంలో.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..