AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మంత్రి ప్రశాంత్ రెడ్డికి చేదు అనుభవం.. ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ నేతల నినాదాలు

కేంద్ర మంత్రి గడ్కరీ మీటింగ్‌లో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రూ.8వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కొత్త నేషనల్ హైవే లకు శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సమయంలో....

Telangana: మంత్రి ప్రశాంత్ రెడ్డికి చేదు అనుభవం.. ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ నేతల నినాదాలు
Prashanth Reddy
Ganesh Mudavath
|

Updated on: Apr 29, 2022 | 3:30 PM

Share

కేంద్ర మంత్రి గడ్కరీ మీటింగ్‌లో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రూ.8వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కొత్త నేషనల్ హైవే లకు శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సమయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తున్న క్రమంలో బీజేపీ నేతలు జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన మంత్రి.. ప్రభుత్వ కార్యక్రమాన్ని బీజేపీ తన కార్యక్రమంగా మార్చుకుందని అసహనం వ్యక్తం చేశారు. అక్కడ బీజేపీ కార్యకర్తలు, జెండాలు చూసి ముందుగానే వెళ్ళిపోదామనుకున్నానని.. కానీ నితిన్ గడ్కరీపై ఉన్న గౌరవంతో సమావేశంలో పాల్గొన్నానని ప్రశాంత్ రెడ్డి అ్నారు. మమ్మల్ని అవమానించాలని ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారన్న తెలంగాణ మంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం అవమానాన్ని దిగమింగుకుని స్పీచ్ కొనసాగించినట్లు వెల్లడించారు. అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారిని సముదాయిస్తే కానీ అదుపులోకి రాలేదని చెప్పారు.

నేను మాట్లాడటం మొదలు పెట్టగానే జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నన్ను మాట్లాడనివ్వకుండా అవమానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అవమానాన్ని దిగమింగుకుని స్పీచ్ కొనసాగించాను. రాష్ట్రానికి ఇచ్చిన నిధులను తెలంగాణకు ఇస్తున్న బహుమతిగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది. బీజేపీ కార్యకర్తల పనికి నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు. దిగజారిన రాజకీయాలకు ఇది నిదర్శనం.

                   – ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీచదవండి

Picture Puzzle: మచ్చా.. ఈ ఫోటోలో 2వ గుడ్లగూబను కనిపెడితే.. మీ ఐ పవర్ అచ్చా..!