AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Frauds: తెలంగాణలో బ్యాంక్‌ ఫ్రాడ్స్‌ కలకలం.. వృద్ధురాలికి సహాయం చేస్తానంటూ రూ.45 లక్షలు కాజేసిన బ్యాంకు ఉద్యోగులు!

Bank Frauds: తెలంగాణలో బ్యాంక్‌ ఫ్రాడ్స్‌ కలకలం రేపుతున్నాయి. ఏకంగా బ్యాంకుల సిబ్బందే మోసాలకు పాల్పడటంతో ఖంగుతింటున్నారు ఖాతాదారులు. ముందుగా..

Bank Frauds: తెలంగాణలో బ్యాంక్‌ ఫ్రాడ్స్‌ కలకలం.. వృద్ధురాలికి సహాయం చేస్తానంటూ రూ.45 లక్షలు కాజేసిన బ్యాంకు ఉద్యోగులు!
Subhash Goud
|

Updated on: Apr 09, 2022 | 5:32 AM

Share

Bank Frauds: తెలంగాణలో బ్యాంక్‌ ఫ్రాడ్స్‌ కలకలం రేపుతున్నాయి. ఏకంగా బ్యాంకుల సిబ్బందే మోసాలకు పాల్పడటంతో ఖంగుతింటున్నారు ఖాతాదారులు. ముందుగా స్మూత్‌గా మాట్లాడి నమ్మిస్తున్నారు. ఆ తర్వాత నట్టెట ముంచుతున్నారు కొందరు బ్యాంకు ఉద్యోగులు (Bank Employees). తాజాగా సికింద్రాబాద్ తుకారాం గేట్‌లో SBI బ్యాంక్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. వృద్ధురాలికి సహాయం చేస్తున్నట్లు నమ్మించి, పలుమార్లు సంతకాలు తీసుకొని ఏకంగా 45 లక్షలు కాజేశాడు. తన ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు గల్లంతు కావడంతో పోలీసులను ఆశ్రయించింది మహిళ. కానీ, పోలీసులు కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మొత్తం 6 బాండ్‌ల మీద 48 లక్షల లోన్ తీసుకున్నారు బ్యాంక్ సిబ్బంది. అంతేకాదు, ఖాతాదారుల సేవింగ్ అకౌంట్‌లో ఉన్న 2 లక్షల 50 వేలను కూడా కొట్టేశారు. 12 ఏళ్లుగా బ్యాంక్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శశి ఈ మోసానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. యెనో అప్‌లో ఫోన్ నెంబర్ మార్చి FDలమీద లోన్ తీసుకున్నాడు ఈ కేటుగాడు.

నాలుగు నెలలుగా బాధితురాలికి బ్యాంకు మెసేజ్‌లు రాకపోవడంతో మేనేజర్‌ని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా ఉంటే, నిర్మల్ జిల్లా భైంసా మండలంలో మరో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. బిజ్జురు గ్రామానికి చెందిన ఓ ఖాతాధారుడి నుంచి, బ్యాంక్ సిబ్బంది అంటూ చెక్కుతీసుకొని 3 లక్షల 50 వేలు కాజేశాడు ఓ అపరిచితుడు. దీనిగురించి బాధితుడి భార్యకు వారం తరువాత సమాచారం ఇచ్చింది బ్యాంక్ సిబ్బంది. రెండేళ్ల క్రితం సాయిరెడ్డి భూమి మాటిగేజ్ చేసి, లోన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన మరణించారు. బీమా కోసం సాయిరెడ్డి చెక్కులు ఇవ్వాలని ఆయన భార్యను అడిగారు అపరిచితులు. చెక్కులు ఇవ్వడంతో 3.50 లక్షలు కాజేశారు. ఈ విషయం తెలిసి లబోదిబోమంటున్నారు బాధితులు.

ఇవి కూడా చదవండి:

Bhadradri Kothagudem: భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. కాల్పులు జరిపిన పోలీసులు

Bhainsa: బైంసాలో శ్రీరామనవమి శోభాయాత్రకు అనుమతి.. ఆదేశాలిచ్చిన తెలంగాణ హైకోర్టు

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!