Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC paper leak case: టీఎస్‌పీఎస్సీ పేపర్‌లీక్‌ కేసులో అసలు ట్విస్ట్‌ ఇదే.. రూ.40 లక్షల బేరానికి మూడు ఏఈ పేపర్లు లీక్..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం పెనుసంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో సిట్‌ ఇప్పటికే వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 15 మందిని నిందితులను విచారిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ నిందితుల విచారణలో తాజాగా కీలక అంశాలు వెలుగులోకి..

TSPSC paper leak case: టీఎస్‌పీఎస్సీ పేపర్‌లీక్‌ కేసులో అసలు ట్విస్ట్‌ ఇదే.. రూ.40 లక్షల బేరానికి మూడు ఏఈ పేపర్లు లీక్..
TSPSC paper leak case
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 03, 2023 | 11:15 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం పెనుసంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో సిట్‌ ఇప్పటికే వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 15 మందిని నిందితులను విచారిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ నిందితుల విచారణలో తాజాగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈ పేపర్‌ లీక్‌లో కేతావత్‌ రాజేశ్వర్‌ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. తొలుత ప్రవీణ్‌ కుమార్‌ ద్వారా రేణుకకు రూ. 10 లక్షలకు ఏఈ పేపర్‌ లీక్‌ అయ్యింది. నమ్మకమైన వారికి పేపర్‌ అమ్మాలని రేణుకకు సూచించాడు. అడ్వాన్స్‌ కింద రేణుక వద్ద నుంచి ప్రవీణ్‌ అడ్వాన్స్‌గా రూ. 5 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత రేణుక తన భర్త డాక్యానాయక్‌ ద్వారా పేపర్లను అమ్మకానికి పెట్టింది. వీరి సమీప బంధువైన రాజేశ్వర్‌కు పేపర్‌ అమ్మకం బాధ్యతలు అప్పగించారు.

మూడు ఏఈ పేపర్లను రాజేశ్వర్‌ రూ.40 లక్షలకు గోపాల్‌, నీలేష్‌, ప్రశాంత్‌, రాజేంద్రకుమార్‌లకు అమ్మాడు. ముందుగా అడ్వాన్స్‌ కింద రూ. 25 లక్షలను పుచ్చుకున్న రాజేశ్వర్‌ మిగిలిన నగదును పరీక్షల అనంతరం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌ కింద తీసుకున్న పాతిక లక్షల్లో రూ.10 లక్షలు డాక్యానాయక్‌కు రాజేశ్వర్‌ ఇచ్చాడు. దానిలో నుంచి మరో రూ.5 లక్షలను ప్రవీణ్‌కు డాక్యా నాయక్‌కు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజేశ్వర్‌ తల్లి సర్పంచ్‌ కావడం చేత రూ.8 లక్షలతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లులు వచ్చాక సెటిల్‌మెంట్‌ చేసుకోవచ్చని తల్లీకొడుకులు కూడబలుక్కున్నారు. సిట్‌ విచారణలో ఇదంతా బయటపడటంతో నిందితుల నుంచి రూ. 8.5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ ఎమోషనల్
ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ ఎమోషనల్
JEE అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. రాత పరీక్ష తేదీ
JEE అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. రాత పరీక్ష తేదీ
ఈప్రత్యేక యాప్ తోనే ఉగ్రవాదుల నరమేథం శిక్షణ ఇచ్చింది పాక్ ఆర్మీనే
ఈప్రత్యేక యాప్ తోనే ఉగ్రవాదుల నరమేథం శిక్షణ ఇచ్చింది పాక్ ఆర్మీనే
IPS టు IAS... యూపీఎస్సీ సివిల్స్‌లో మెరిసిన తెలుగు కుర్రోడు!
IPS టు IAS... యూపీఎస్సీ సివిల్స్‌లో మెరిసిన తెలుగు కుర్రోడు!
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్..
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్..
ఇకపై ఇంటర్‌లో 6 సబ్జెక్టులు.. ఆరో సబ్జెక్టులో ఫెయిలైనా నో టెన్షన్
ఇకపై ఇంటర్‌లో 6 సబ్జెక్టులు.. ఆరో సబ్జెక్టులో ఫెయిలైనా నో టెన్షన్
గంభీర్‌కు హత్య బెదిరింపులు.. ఐసిస్ ఈమెయిల్ కలకలం!
గంభీర్‌కు హత్య బెదిరింపులు.. ఐసిస్ ఈమెయిల్ కలకలం!
కేబినెట్‌ విస్తరణపై రేవంత్‌ ఒకలా.. మీనాక్షి మరోలా..! పెద్ద కథే..
కేబినెట్‌ విస్తరణపై రేవంత్‌ ఒకలా.. మీనాక్షి మరోలా..! పెద్ద కథే..
పాక్‌కు చావుదెబ్బ.. సిందూ నదీ జలాల ఒప్పందం రద్దు చేసిన భారత్‌..!
పాక్‌కు చావుదెబ్బ.. సిందూ నదీ జలాల ఒప్పందం రద్దు చేసిన భారత్‌..!
వేసవిలో చల్లదనం కోసం కూల్ డ్రింక్స్ బదులుగా ఈ పానీయాలు తాగండి..
వేసవిలో చల్లదనం కోసం కూల్ డ్రింక్స్ బదులుగా ఈ పానీయాలు తాగండి..