AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పొట్టకూటి కోసం వచ్చి విగతజీవులుగా మారిన కార్మికులు.. ఐదుగురు మృతి!

హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలంలో సోమవారం (ఏప్రిల్ 28) సాయంత్రం సంభవించిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకృతి ప్రకోపానికి తోడు పారిశ్రామిక భద్రతా లోపాలు తోడవడంతో ఐదుగురు అమాయక కార్మికులు బలికాగా, మరో 11 మంది ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

Hyderabad:  పొట్టకూటి కోసం వచ్చి విగతజీవులుగా మారిన కార్మికులు.. ఐదుగురు మృతి!
Crane Collapses
Balaraju Goud
|

Updated on: Apr 28, 2026 | 7:13 AM

Share

హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలంలో సోమవారం (ఏప్రిల్ 28) సాయంత్రం సంభవించిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకృతి ప్రకోపానికి తోడు పారిశ్రామిక భద్రతా లోపాలు తోడవడంతో ఐదుగురు అమాయక కార్మికులు బలికాగా, మరో 11 మంది ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

శంకరపల్లి మండలం మహాలింగాపురం పరిధిలోని ఎన్ సీసీ (NCC) సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో సోమవారం సాయంత్రం కార్మికులు తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులు వీచడంతో కంపెనీ ప్రాంగణంలోని ఒక భారీ క్రేన్ ఒక్కసారిగా అదుపుతప్పి, కింద పని చేస్తున్న కార్మికులపై కుప్పకూలింది. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం 16 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్రేన్ కింద నలిగి ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు, స్థానికులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే శంకరపల్లిలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు . గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా కంపెనీలో ఉండాల్సిన భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా? అంత భారీ క్రేన్ గాలికి పడిపోయేంత బలహీనంగా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ విషాద ఘటనతో మహాలింగాపురం గ్రామ ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పొట్టకూటి కోసం వచ్చి విగతజీవులుగా మారిన కార్మికుల కుటుంబాల్లో తీరని వేదన మిగిలింది. ప్రభుత్వం మరియు యాజమాన్యం బాధితులను ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
క్రేన్‌ కింద నలిగిన కార్మకులు.. ఐదుగురు మృతి.. 11 మందికి సీరియస్!
క్రేన్‌ కింద నలిగిన కార్మకులు.. ఐదుగురు మృతి.. 11 మందికి సీరియస్!
JBL అదిరిపోయే సౌండ్‌బార్స్..డాల్బీ అట్మోస్‌తో ఇక మీ ఇల్లే థియేటర్
JBL అదిరిపోయే సౌండ్‌బార్స్..డాల్బీ అట్మోస్‌తో ఇక మీ ఇల్లే థియేటర్
మనుషులకు భయపడదు.. రాత్రుళ్లు మాత్రమే వేటాడుతుంది..
మనుషులకు భయపడదు.. రాత్రుళ్లు మాత్రమే వేటాడుతుంది..
ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ జంప్.. టాప్ 5 బ్యాటర్ల జాబితా ఇదే
ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ జంప్.. టాప్ 5 బ్యాటర్ల జాబితా ఇదే
పోలీసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..ఇకపై ఆ రోజుల్లో ప్రత్యేక సెలవులు
పోలీసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..ఇకపై ఆ రోజుల్లో ప్రత్యేక సెలవులు
ళ్లు తోమకుండా నీళ్లు తాగితే ఏం జరుగుతుంది.. తెలిస్తే
ళ్లు తోమకుండా నీళ్లు తాగితే ఏం జరుగుతుంది.. తెలిస్తే
ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్‌.. 1వ తేదీన జీతాలు రావు!
ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్‌.. 1వ తేదీన జీతాలు రావు!
సుర్రుమంటున్న సూరీడు.. ఇవాళ ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు
సుర్రుమంటున్న సూరీడు.. ఇవాళ ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు
ఇదే మంచి ఛాన్స్.. మహిళలకు గుడ్‌న్యూస్‌..తులం బంగారం ధర ఎంతంటే..!
ఇదే మంచి ఛాన్స్.. మహిళలకు గుడ్‌న్యూస్‌..తులం బంగారం ధర ఎంతంటే..!
ఒక్క ఛాన్స్ కోసం ఆ హీరో తండ్రిని బ్రతిమిలాడా
ఒక్క ఛాన్స్ కోసం ఆ హీరో తండ్రిని బ్రతిమిలాడా