Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: దుకాణం ముందు కుర్చీలు వేయవద్దన్నందుకు వృద్ధుడిని కొట్టి చంపిన యువకులు!

హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో దారుణం వెలుగు చూసింది. చిన్న వివాదం విషాదంగా మారింది. 62ఏళ్ల వృద్ధుడిని అత్యంత పాశవికంగా కొట్టి చంపారు దుండగులు. హఫీజ్ బాబా నగర్ సమీపంలో 62ఏళ్ల వృద్ధుడు జకీర్ ఖాన్ కిరాణం షాపు నిర్వహిస్తున్నాడు. అతని దుకాణం ముందు వేసిన కుర్చీల విషయంలో తలెత్తిన వివాదం విషాదంగా మారింది.

Hyderabad: దుకాణం ముందు కుర్చీలు వేయవద్దన్నందుకు వృద్ధుడిని కొట్టి చంపిన యువకులు!
Hyderabad Crime
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Balaraju Goud

Updated on: Mar 13, 2025 | 7:51 AM

హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో చిన్న వివాదం విషాదంగా మారింది. అక్కడ యువకులు దాడి చేయడంతో 62 ఏళ్ల దుకాణదారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన చిన్న సమస్యలకే పెరుగుతున్న హింసపై తీవ్రమైన ఆందోళనలను కలిగిస్తోంది. బాధితుడు, 62 ఏళ్ల జకీర్ ఖాన్, హఫీజ్ బాబా నగర్‌లోని సి బ్లాక్‌లో కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడు. ఆయన దుకాణం ముందు కుర్చీలు వేయడంపై తలెత్తిన వివాదం పక్కనే ఉన్న పాన్ షాపు యజమానులతో వాగ్వాదానికి దారితీసింది. వాగ్వాదం మధ్యలో పాన్ షాపు యజమానులు జకీర్ ఖాన్‌పై దాడికి పాల్పడ్డారు.

దాడి తరువాత, జాకీర్ ఖాన్ కుప్పకూలిపోయి స్పృహ కోల్పోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా, దురదృష్టవశాత్తు, అతను తరలించేలోగా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కంచన్‌బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి, అధికారులు సంబంధిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న చిన్న వివాదాలకు అదుపు లేకుండా ప్రాణాలే పోతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..