త్వరలో లాంచ్ కానున్న కియా మోటార్స్ సోనెట్.. రికార్డ్ బుకింగ్లు
ఆంధ్రప్రదేశ్లోని అనంతపూరం ప్లాంట్లో ప్రత్యేకంగా రూపొందించిన కియా మోటార్స్ ఎస్యూవీ సోనెట్ను ఆవిష్కరించింది
Kia Motors Sonet: ఆంధ్రప్రదేశ్లోని అనంతపూరం ప్లాంట్లో ప్రత్యేకంగా రూపొందించిన కియా మోటార్స్ ఎస్యూవీ సోనెట్ను ఆవిష్కరించింది. కియా సోనెట్ సంస్థ తయారు చేసిన తాజా ‘మేడ్-ఇన్-ఇండియా’ ఉత్పత్తి ఇదే కాగా.. ఈ నెలలోనే దీన్ని లాంచ్ చేయనున్నారు. కియా సెల్టోస్ మాదిరిగానే సోనెట్ని దేశీయ మార్కెట్తో పాటు, ప్రపంచ మార్కెట్లలో విక్రయించనున్నారు. పెద్ద ఎత్తున ఈ కార్లను ఉత్పత్తి చేస్తున్నామని.. దేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లోనూ, క్లిష్టమైన ప్రదేశాల్లోనూ 100,000 కిలోమీటర్లకు పైగా పరీక్షించిన తరువాత ప్రారంభించామని కంపెనీ తెలిపింది. గత నెలలో జరిగిన వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించిన దీన్ని.. సెప్టెంబర్18న ఇక్కడ ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తోంది.
ఈ సందర్భంగా కూఖ్యూన్ షిమ్ మాట్లాడుతూ.. తమ తొలి కస్టమర్ కారు కియా సోనెట్ని అధికారికంగా విడుదల చేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం పరిస్థితుల్లో సొనెట్ను తీసుకురాడం చాలా గర్వించదగిన విషయం. ఇది మాకు ముఖ్యమైన రోజు. అనంతపురంలోని అత్యాధునిక ప్లాంట్ ఉద్యోగుల అభిరుచి, అంకితభావానికి నిదర్శం” అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే సోనెట్కి బుకింగ్స్ ప్రారంభించిన మొదటి రోజే 6,523 యూనిట్లు బుకింగ్ అయ్యాయి. ఇంటిలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, టెక్నికల్, డైనమిక్ డిజైన్, 30కు పైగా అత్యుత్తమ ఫీచర్లు, వాయిస్ అసిస్ట్, 57 యువీఓ కనెక్ట్ ఫీచర్లు, డీఎన్ఏ బోల్డ్, విలక్షణమైన డిజైన్లతో కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో కియా సోనెట్ ఆకర్షించనుంది.
Read More:
ఈ నెల 18న కనక దుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
సుశాంత్ కేసు: రియా సోదరుడు అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు