AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలో మొట్టమొదటిసారిగా ఎగిరే కార్లు.. ప్రత్యేకతలేంటంటే?

మన భారతదేశంలోకి మొట్టమొదటిసారిగా ఎగిరే కార్లు రాబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను చేసినట్టు తెలుస్తోంది. టెక్నాలజీలో.. ఇండియా కూడా విదేశాలతో పోటీ పడుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్లైయింగ్ కార్లకు..

ఇండియాలో మొట్టమొదటిసారిగా ఎగిరే కార్లు.. ప్రత్యేకతలేంటంటే?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 11, 2020 | 5:15 PM

Share

మన భారతదేశంలోకి మొట్టమొదటిసారిగా ఎగిరే కార్లు రాబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను చేసినట్టు తెలుస్తోంది. టెక్నాలజీలో.. ఇండియా కూడా విదేశాలతో పోటీ పడుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్లైయింగ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు వీటి కోసం భారతదేశంలోనూ ఓ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారట. మన దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ చాలా పెద్దది. యూరప్ దేశాలకు కూడా మన దేశం నుంచి కార్లు ఎగుమతి అవుతాయి. అందుకే భారత్‌లో తొలి ఫ్లయింగ్ కారును తయారు చేయాలని నెదర్లాండ్స్‌కి చెందిన ఓ కంపెనీ డిసైడైంది.

ఈ ఫ్లయింగ్ కారు పేరు పాల్-వీ (పర్సనల్ ఎయిర్ లాండ్ వెహికల్). దీని తయారీ కోసం గుజరాత్‌లో ఓ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారట. 2021నుంచీ కార్ల ఉత్పత్తి ప్లాన్ కొనసాగుతుందని వారు తెలిపారు. కాగా.. కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు కోసం గుజరాత్ ప్రభుత్వంతో.. డీల్ కూడా కుదిరింది. అలాగే.. ప్లాంట్‌కి కావాల్సిన అన్ని సదుపాయాలూ అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.

పాల్-వీ కార్లు రోడ్డుపై.. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. అదే గాల్లో అయితే.. గంటకు 180 కిలో మీటర్ల వేగంతో వెళ్తుందట. ఈ కారులో ఇద్దరు ప్రయాణించవచ్చు. అలాగే దీనికి రెండు ఇంజిన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక వేళ ఒక ఇంజిన్ దెబ్బతింటే.. మరో ఇంజిన్ ద్వారా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నెదర్లాండ్స్ కంపెనీకి చెందిన తయారీదారులు పేర్కొన్నారు.

Read More this also: లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..

టీడీపీ నేతల కారుపై దాడి.. చంద్రబాబు ఫైర్

వేలానికి మాజీ మంత్రి గంటా ఆస్తులు..

రాష్ట్రంలో కావాలనే టీడీపీ అల్లకల్లోలం సృష్టిస్తుంది

కోలీవుడ్‌లో కలకలం.. అనుష్క, రానాలకు పెద్ద చిక్కు