టీ20ల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

| Edited By: Srinu

Mar 06, 2019 | 7:45 PM

విశాఖ: ఆసీస్ తో జరిగిన తొలి టీ20లో భారత్ చివరి దాకా పోరాడి ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పేరిట ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 24 పరుగులకు కోహ్లీ అవుటైన విషయం తెలిసిందే. దీనితో ఆస్ట్రేలియా పై టీ20ల్లో కోహ్లీ స్కోర్ 512 పరుగులకు చేరింది. ఆసీస్ తో ఇప్పటివరకు 15 టీ20ల్లో కోహ్లీ 56.88 సగటుతో 512 పరుగులు చేశాడు.  ఇప్పటి వరకు టీ20ల్లో […]

టీ20ల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు
Follow us on

విశాఖ: ఆసీస్ తో జరిగిన తొలి టీ20లో భారత్ చివరి దాకా పోరాడి ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పేరిట ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్ లో 24 పరుగులకు కోహ్లీ అవుటైన విషయం తెలిసిందే. దీనితో ఆస్ట్రేలియా పై టీ20ల్లో కోహ్లీ స్కోర్ 512 పరుగులకు చేరింది. ఆసీస్ తో ఇప్పటివరకు 15 టీ20ల్లో కోహ్లీ 56.88 సగటుతో 512 పరుగులు చేశాడు.  ఇప్పటి వరకు టీ20ల్లో ఒక టీం పై ఓ బ్యాట్స్ మెన్ 500కు పైగా పరుగులు చేయడం ఇదే మొదటిసారి. ఈ ఘనత కోహ్లీ కే దక్కింది. ఇలాంటి మరెన్ని రికార్డ్స్ విరాట్ కోహ్లీ తిరగ రాస్తాడో చూడాలి.