AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంత్ పేలవ బ్యాటింగ్‌కు.. ఆడుకున్న నెటిజన్లు!

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. నిన్న జరిగిన చివరి టీ20లో తన ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరడంతో నెటిజన్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇక రోహిత్ పెవిలియన్ చేరుకోగానే కోహ్లీ స్థానంలో పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే అతడు వచ్చిన వెంటనే ఖాతా తెరవకుండానే ఔట్ కావడంతో.. సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇస్తే బాగుండేదని అందరూ […]

పంత్ పేలవ బ్యాటింగ్‌కు.. ఆడుకున్న నెటిజన్లు!
Ravi Kiran
|

Updated on: Dec 12, 2019 | 9:58 PM

Share

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. నిన్న జరిగిన చివరి టీ20లో తన ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరడంతో నెటిజన్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇక రోహిత్ పెవిలియన్ చేరుకోగానే కోహ్లీ స్థానంలో పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే అతడు వచ్చిన వెంటనే ఖాతా తెరవకుండానే ఔట్ కావడంతో.. సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇస్తే బాగుండేదని అందరూ కూడా అభిప్రాయపడ్డారు.

అటు పంత్‌కు కోహ్లీ పూర్తి మద్దతు ఇస్తుండటంతో.. ఫ్యాన్స్ పంత్ విఫలమైన ప్రతీసారి చురకలంటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో టీ20లో పంత్ ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరడంతో.. సోషల్ మీడియాలో మేమేస్ ద్వారా పంత్‌ను ఆడుకున్నారు. ఒకసారి వాటిపై మీరు కూడా లుక్కేయండి.