AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV Sindhu: చరిత్ర సృష్టించడంలో పీవీ సింధు విఫలం.. ప్రీ క్వార్టర్స్‌లో ఓటమి.. పతకం లేకుండానే పారిస్ నుంచి రిటన్

Paris Olympics 2024 PV Sindhu: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆరో రోజు భారత్‌కు శ్రేయస్కరం కాలేదు. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నుంచి పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తుందని భారత అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఆరోరోజు ముగిసే సమయానికి పీవీ సింధు కూడా నిరాశపరిచింది. నిన్న పారిస్ ఒలింపిక్స్‌లో జరిగిన రౌండ్-16 మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి పీవీ సింధు చైనా క్రీడాకారిణి హీ బింగ్ జియావోతో తలపడింది.

PV Sindhu: చరిత్ర సృష్టించడంలో పీవీ సింధు విఫలం.. ప్రీ క్వార్టర్స్‌లో ఓటమి.. పతకం లేకుండానే పారిస్ నుంచి రిటన్
Pv Sindhu
Venkata Chari
|

Updated on: Aug 02, 2024 | 6:41 AM

Share

Paris Olympics 2024 PV Sindhu: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆరో రోజు భారత్‌కు శ్రేయస్కరం కాలేదు. భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నుంచి పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తుందని భారత అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఆరోరోజు ముగిసే సమయానికి పీవీ సింధు కూడా నిరాశపరిచింది. నిన్న పారిస్ ఒలింపిక్స్‌లో జరిగిన రౌండ్-16 మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి పీవీ సింధు చైనా క్రీడాకారిణి హీ బింగ్ జియావోతో తలపడింది. ఈ గేమ్‌లో పీవీ సింధు ఓడిపోయింది. చైనాకు చెందిన బింగ్ జియావోతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన సింధు పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా మూడో పతకం సాధించాలన్న కల చెదిరిపోయి చరిత్ర సృష్టించే అవకాశాన్ని కూడా కోల్పోయింది.

పీవీ సింధు మ్యాచ్‌ పరిస్థితి..

ఇప్పుడు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు ఓటమితో భారత్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది. తొలి సెట్‌లో చైనాకు చెందిన బింగ్ జియావో 21-19తో పీవీ సింధుపై గెలుపొందగా, రెండో సెట్‌లో కూడా సింధు 14-21తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు ప్రయాణం ముగిసింది.

మూడో పతకాన్ని కోల్పోయిన సింధు..

16వ రౌండ్‌లో బింగ్ జియావో చేతిలో ఓడిపోవడంతో చారిత్రాత్మక మూడో ఒలింపిక్ పతకాన్ని సాధించాలన్న పీవీ సింధు కల చెదిరిపోయింది. పీవీ సింధు తొలి సెట్‌ నుంచే ఒత్తిడిలో పడింది. ఆరంభంలో సింధు మెరుగైన ఆటతీరు కనబరిచింది. రెండో గేమ్ ఆరంభంలోనూ బింగ్ జియో ఆధిపత్యం కనిపించింది. రెండో గేమ్‌లో సింధు 2-8తో వెనుకంజలో ఉంది. అయితే, రెండో గేమ్‌లోనూ చైనా క్రీడాకారిణితో పోటీపడే ప్రయత్నం చేసింది సింధు.

ఇవి కూడా చదవండి

లక్ష్యం సేన్‌పైనే ఆశలన్నీ..

పారిస్ ఒలింపిక్స్‌లో ఆరో రోజు లక్ష్య సేన్ అద్భుత ప్రదర్శన చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ప్రీక్వార్టర్‌ ఫైనల్‌లో భారత్‌కు చెందిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌పై లక్ష్య విజయం సాధించాడు. ఇప్పుడు బ్యాడ్మింటన్ పోటీలో కోట్లాది మంది భారతీయుల కళ్లు లక్ష్య సేన్‌పై నిలిచాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..