AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paralympics 2024: 56 ఏళ్ల తర్వాత తొలిసారి.. పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత్..

Paralympics 2024: ఒకే సీజన్‌లో భారత్‌కు అత్యధికంగా స్వర్ణాలు రావడం ఇదే తొలిసారి. గతంలో టోక్యో పారాలింపిక్స్‌లో భారత జట్టు ఐదు స్వర్ణ పతకాలు సాధించింది. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో సహా 26 పతకాలు సాధించింది.

Venkata Chari
|

Updated on: Sep 07, 2024 | 6:55 AM

Share
ఇప్పటి వరకు పారిస్ పారాలింపిక్స్ లో భారత పారా అథ్లెట్లు అంచనాలకు మించి రాణించారు. దీంతో పారాలింపిక్స్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక పతకాలు సాధించిన రికార్డులో భారత అథ్లెట్లు నిలిచారు. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో సహా 26 పతకాలు సాధించింది.

ఇప్పటి వరకు పారిస్ పారాలింపిక్స్ లో భారత పారా అథ్లెట్లు అంచనాలకు మించి రాణించారు. దీంతో పారాలింపిక్స్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక పతకాలు సాధించిన రికార్డులో భారత అథ్లెట్లు నిలిచారు. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో సహా 26 పతకాలు సాధించింది.

1 / 7
క్రీడల 9వ రోజు, పురుషుల హైజంప్ T54 ఈవెంట్‌లో ప్రవీణ్ కుమార్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం ద్వారా భారత్ బంగారు పతకాల సంఖ్యను 6 కి తీసుకెళ్లాడు. ఈ గేమ్స్‌లో ఒకే సీజన్‌లో భారత్‌ ఇన్ని స్వర్ణాలు సాధించడం ఇదే తొలిసారి. గతంలో టోక్యో పారాలింపిక్స్‌లో భారత జట్టు ఐదు స్వర్ణ పతకాలు సాధించింది.

క్రీడల 9వ రోజు, పురుషుల హైజంప్ T54 ఈవెంట్‌లో ప్రవీణ్ కుమార్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం ద్వారా భారత్ బంగారు పతకాల సంఖ్యను 6 కి తీసుకెళ్లాడు. ఈ గేమ్స్‌లో ఒకే సీజన్‌లో భారత్‌ ఇన్ని స్వర్ణాలు సాధించడం ఇదే తొలిసారి. గతంలో టోక్యో పారాలింపిక్స్‌లో భారత జట్టు ఐదు స్వర్ణ పతకాలు సాధించింది.

2 / 7
ఈ పారాలింపిక్స్‌లో షూటర్ అవనీ లేఖరా భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అవని బంగారు పతకాన్ని గెలుచుకోగా, అదే ఈవెంట్‌లో భారతదేశానికి చెందిన మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

ఈ పారాలింపిక్స్‌లో షూటర్ అవనీ లేఖరా భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అవని బంగారు పతకాన్ని గెలుచుకోగా, అదే ఈవెంట్‌లో భారతదేశానికి చెందిన మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

3 / 7
పురుషుల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌3 ఈవెంట్‌లో నితేష్‌ కుమార్‌ భారత్‌కు రెండో బంగారు పతకాన్ని అందించాడు. గత పారాలింపిక్స్‌లోనూ భారత్ ఈ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. ఆ తర్వాత ప్రమోద్ భగత్ భారత్ నుంచి స్వర్ణం చేజిక్కించుకున్నాడు.

పురుషుల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌3 ఈవెంట్‌లో నితేష్‌ కుమార్‌ భారత్‌కు రెండో బంగారు పతకాన్ని అందించాడు. గత పారాలింపిక్స్‌లోనూ భారత్ ఈ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. ఆ తర్వాత ప్రమోద్ భగత్ భారత్ నుంచి స్వర్ణం చేజిక్కించుకున్నాడు.

4 / 7
సుమిత్ అంటిల్ భారత్‌కు మూడో బంగారు పతకాన్ని అందించాడు. జావెలిన్ త్రోయింగ్ ఈవెంట్‌లో సుమిత్ 70.59 మీటర్ల దూరం జావెలిన్ విసిరి చరిత్ర సృష్టించి బంగారు పతకం సాధించాడు. గత పారాలింపిక్స్‌లోనూ సుమిత్ స్వర్ణం సాధించాడు.

సుమిత్ అంటిల్ భారత్‌కు మూడో బంగారు పతకాన్ని అందించాడు. జావెలిన్ త్రోయింగ్ ఈవెంట్‌లో సుమిత్ 70.59 మీటర్ల దూరం జావెలిన్ విసిరి చరిత్ర సృష్టించి బంగారు పతకం సాధించాడు. గత పారాలింపిక్స్‌లోనూ సుమిత్ స్వర్ణం సాధించాడు.

5 / 7
ఆర్చరీ ఈవెంట్‌లో హర్విందర్ సింగ్ భారతదేశానికి మొట్టమొదటి పారాలింపిక్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. హర్విందర్ సాధించిన పతకం భారత్‌కు నాలుగో బంగారు పతకం. అంతకుముందు టోక్యో పారాలింపిక్స్‌లో హర్విందర్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు.

ఆర్చరీ ఈవెంట్‌లో హర్విందర్ సింగ్ భారతదేశానికి మొట్టమొదటి పారాలింపిక్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. హర్విందర్ సాధించిన పతకం భారత్‌కు నాలుగో బంగారు పతకం. అంతకుముందు టోక్యో పారాలింపిక్స్‌లో హర్విందర్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు.

6 / 7
పారిస్ పారాలింపిక్స్‌లో అథ్లెటిక్స్ కింద క్లబ్ త్రో F51 ఈవెంట్‌లో ధరంబీర్ నైన్ 34.92 మీటర్ల ఆసియా రికార్డును నెలకొల్పి స్వర్ణం సాధించాడు. ఈ స్వర్ణం పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు ఐదో స్వర్ణం.

పారిస్ పారాలింపిక్స్‌లో అథ్లెటిక్స్ కింద క్లబ్ త్రో F51 ఈవెంట్‌లో ధరంబీర్ నైన్ 34.92 మీటర్ల ఆసియా రికార్డును నెలకొల్పి స్వర్ణం సాధించాడు. ఈ స్వర్ణం పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు ఐదో స్వర్ణం.

7 / 7