World Billiards Championship: ఫైనల్లో సత్తా చాటిన పంకజ్ అద్వానీ.. 26వ సారి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ సొంతం..
Pankaj Advani World Billiards Championship: సెమీ ఫైనల్లోనూ పంకజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రపంచ బిలియర్డ్స్, స్నూకర్లలో 26 సార్లు ఛాంపియన్ అయిన పంకజ్ సెమీ-ఫైనల్లో రూపేష్ షాను ఓడించాడు. దీంతో ఫైనల్కు చేరాడు. పంకజ్ 900-273తో రూపేష్పై విజయం సాధించాడు. సౌరవ్ కొఠారి గురించి మాట్లాడితే, అతను రెండవ సెమీ ఫైనల్లో ధృవ్ సిత్వాలాను ఓడించాడు. ఈ మ్యాచ్లో కొఠారీ 900-756తో ఉత్కంఠ విజయం సాధించాడు.

Pankaj Advani World Billiards Championship 2023: భారత స్టార్ క్యూ ప్లేయర్ పంకజ్ అద్వానీ చరిత్ర సృష్టించాడు. మంగళవారం జరిగిన ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌరవ్ కొఠారీని ఓడించాడు. దీంతో పంకజ్ 26వ సారి ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్నాడు. సౌరవ్ కూడా భారత ఆటగాడే కావడం గమనార్హం. కానీ ఫైనల్లో పంకజ్పై నిలవలేకపోయాడు.
పంకజ్ 2005లో తన తొలి ప్రపంచ టైటిల్ను గెలుచుకున్నాడు. అతను సుదీర్ఘ ఫార్మాట్లో తొమ్మిది సార్లు టైటిల్ను గెలుచుకున్నాడు. అతను పాయింట్ ఫార్మాట్లో ఎనిమిది సార్లు ఛాంపియన్గా ఉన్నాడు. ఇది కాకుండా, అతను ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను గెలుచుకోవడంలో కూడా విజయం సాధించాడు. అద్వానీ అంతకుముందు సెమీ ఫైనల్లో భారతీయుడైన రూపేష్ షాపై 900-273 తేడాతో విజయం సాధించాడు. కొఠారీ సెమీ ఫైనల్లో 900-756తో ధ్రువ్ సిత్వాలాపై విజయం సాధించాడు.




సెమీ ఫైనల్లోనూ పంకజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రపంచ బిలియర్డ్స్, స్నూకర్లలో 26 సార్లు ఛాంపియన్ అయిన పంకజ్ సెమీ-ఫైనల్లో రూపేష్ షాను ఓడించాడు. దీంతో ఫైనల్కు చేరాడు. పంకజ్ 900-273తో రూపేష్పై విజయం సాధించాడు. సౌరవ్ కొఠారి గురించి మాట్లాడితే, అతను రెండవ సెమీ ఫైనల్లో ధృవ్ సిత్వాలాను ఓడించాడు. ఈ మ్యాచ్లో కొఠారీ 900-756తో ఉత్కంఠ విజయం సాధించాడు.
IBSF World Billiards Champion (Long Format) 🏆😊 This is for us India 🇮🇳🙏🏻 pic.twitter.com/kLEdRPpnnq
— Pankaj Advani (@PankajAdvani247) November 21, 2023
ఇప్పటి వరకు పంకజ్ అద్వానీ కెరీర్ అద్భుతంగా సాగడం గమనార్హం. అతను 1999లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్లో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో పంకజ్ పాల్గొన్నాడు. అతను 2005లో IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్నాడు. గ్రాండ్ డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించి.. భారత్కు బంగారు పతకాన్ని అందించాడు. 2010 ఆసియా క్రీడల్లో పంకజ్ బంగారు పతకం సాధించాడు. సింగిల్స్లో పాల్గొన్నాడు. ఇంతకు ముందు 2006లో దోహాలో నిర్వహించిన ఆసియా క్రీడల్లోనూ స్వర్ణం సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..