AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం… సిరీస్‌ కైవసం!

భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సౌతాఫ్రికాపై ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడో టెస్టు ఈనెల 19 నుంచి రాంచీలో జరగనుంది. ఈ రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీల ఇన్నింగ్స్‌ టీ బ్రేక్‌ తర్వాత ముగిసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో డీన్‌ ఎల్గర్‌(48), బావుమా(38), ఫిలిండర్‌(37), మహరాజ్‌(22)లు  మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారంతా […]

రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం... సిరీస్‌ కైవసం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 13, 2019 | 4:11 PM

Share

భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సౌతాఫ్రికాపై ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడో టెస్టు ఈనెల 19 నుంచి రాంచీలో జరగనుంది. ఈ రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీల ఇన్నింగ్స్‌ టీ బ్రేక్‌ తర్వాత ముగిసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో డీన్‌ ఎల్గర్‌(48), బావుమా(38), ఫిలిండర్‌(37), మహరాజ్‌(22)లు  మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారంతా దారుణంగా విఫలయ్యారు. దాంతో  కోహ్లి అండ్‌ గ్యాంగ్‌  ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది.