నాలుగో వన్డే: టాస్‌ గెలిచిన భారత్‌

|

Mar 10, 2019 | 1:35 PM

మొహాలి: ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 తేడాతో ముందజలో ఉండగా.. ఆసీస్‌ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు భారత్‌ ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను ఖతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ధోని స్థానంలో యువ […]

నాలుగో వన్డే: టాస్‌ గెలిచిన భారత్‌
Follow us on

మొహాలి: ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 తేడాతో ముందజలో ఉండగా.. ఆసీస్‌ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు భారత్‌ ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను ఖతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ధోని స్థానంలో యువ బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌కు భారత జట్టులో చోటు కల్పించారు.