సిరీస్ క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్!

గయానా: విండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లోనూ భారత్ విజయకేతనం ఎగరవేసింది. రిషబ్‌ పంత్‌(65నాటౌట్‌; 42బంతుల్లో 4×4, 4×6), కెప్టెన్ విరాట్‌ కోహ్లీ(52; 45బంతుల్లో 6×4) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో.. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 19.1 ఓవర్లలో ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. విండీస్‌ బౌలర్లలో థామస్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. టాస్ ఓడి మొదట […]

సిరీస్ క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 07, 2019 | 8:05 AM

గయానా: విండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లోనూ భారత్ విజయకేతనం ఎగరవేసింది. రిషబ్‌ పంత్‌(65నాటౌట్‌; 42బంతుల్లో 4×4, 4×6), కెప్టెన్ విరాట్‌ కోహ్లీ(52; 45బంతుల్లో 6×4) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో.. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 19.1 ఓవర్లలో ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. విండీస్‌ బౌలర్లలో థామస్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు భారత్ బౌలర్లు చుక్కలు చూపించారు. అయితే మిడిల్ ఆర్డర్‌లో పొలార్డ్(58), పావెల్(32) రాణించడంతో.. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 146 పరుగులు చేసింది. అటు దీపక్ చాహర్ 3 వికెట్లు పడగొట్టగా.. సైనీ రెండు వికెట్లు, రాహుల్ చాహర్ ఒక్క వికెట్ తీశారు.