Champions Trophy: బీసీసీఐ సెలెక్టర్లను ఏకిపారేసిన యూవీ తండ్రి.. ఆ యువకుడు ఏ పాపం చేశాడంటూ ఫైర్

Yograj Singh Comments on Abhishek Sharma: యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఓ యువ ఆటగాడిని చేర్చుకోవాలని సూచించాడు. ఈ టోర్నమెంట్ ప్రకటన తర్వాత, అతను ఒక యువకుడిని ప్రశంసించాడు. అతనిని భవిష్యత్ స్టార్ అంటూ పిలిచాడు. అలాగే జట్టులో ఉండాల్సిందేని చూసించాడు.

Champions Trophy: బీసీసీఐ సెలెక్టర్లను ఏకిపారేసిన యూవీ తండ్రి.. ఆ యువకుడు ఏ పాపం చేశాడంటూ ఫైర్
Abhishek Sharma Yograj Sing

Updated on: Jan 19, 2025 | 6:27 PM

Yograj Singh Comments on Abhishek Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్ ఎంపిక కాలేదు. ఇద్దరూ టీమ్ ఇండియాలో ఎంపిక కావడానికి పెద్ద పోటీదారులుగా ఉన్నారు. కానీ, సెలెక్టర్లు ఈ స్టార్లకు చోటు ఇవ్వలేదు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియాలో 24 ఏళ్ల ఆటగాడిని చేర్చాలని యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ సమర్థించారు. ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయని యువ ఆటగాడు అభిషేక్ శర్మను భారత జట్టులో చేర్చుకోవాలని యోగరాజ్ సింగ్ కోరుతున్నాడు.

అభిషేక్ శర్మ తరపున వాదించిన యోగరాజ్..

యోగరాజ్ సింగ్ ప్రముఖ ఆటగాడు యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్. యోగరాజ్ కూడా టీమ్ ఇండియా కోసం కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. కానీ, అతని క్రికెట్ కెరీర్ చాలా త్వరగా ముగిసింది. యోగరాజ్ తరచుగా క్రికెట్‌కు సంబంధించిన సమస్యలపై మాట్లాడటం కనిపిస్తుంది. ఇప్పుడు అతను ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ ఇండియాను ప్రకటించిన తర్వాత అభిషేక్ శర్మకు మద్దతు ఇచ్చాడు.

IANSతో యోగరాజ్ మాట్లాడుతూ.. ‘విషయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇది సరైన మార్గం. చెడు సమయాలను ఎదుర్కొంటున్న ఆటగాళ్లకు మేం మద్దతు ఇవ్వాలి. అభిషేక్ శర్మ కూడా జట్టులో ఉండాలని నేను చెబుతున్నాను. ఎందుకంటే, అతను భవిష్యత్తులో పెద్ద ఆటగాడు కాబోతున్నాడు. అతను నేర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం’ అంటూ చెప్పుకొచ్చాడు.

జైస్వాల్‌కి ఎందుకు అవకాశం వచ్చింది?

అభిషేక్ శర్మ ఇంకా ఏ వన్డే మ్యాచ్ ఆడలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ఇప్పుడు అతను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి ఎందుకు ఎంపికయ్యాడు? ఇతర ఫార్మాట్లలో అతని అద్భుతమైన ప్రదర్శన దీనికి సాధారణ సమాధానం. 2024 సంవత్సరంలో, జైస్వాల్ భారత్ తరపున అత్యధిక టెస్టు పరుగులు చేసిన, అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్. టీ20 క్రికెట్‌లోనూ తన సత్తా చాటుకున్నాడు. అభిషేక్ ఇప్పటివరకు భారత్ తరపున టీ20 క్రికెట్ మాత్రమే ఆడాడు. జైస్వాల్‌తో పోలిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అతనికి తక్కువ అనుభవం కూడా ఉంది. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోవడం జైస్వాల్‌కు కష్టమే. అతను రోహిత్ శర్మ లేదా శుభ్‌మన్ గిల్‌కు బ్యాకప్‌గా మాత్రమే ఈ టోర్నీలో ఆడగలడు. ఎందుకంటే జైస్వాల్ కూడా వీరిద్దరిలానే ఓపెనర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..